Off The Record: ఆ జిల్లాపై పట్టుకోసం కాంగ్రెస్లో కుమ్ములాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెండు అడుగుల ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. నాయకుల మధ్య సమన్వయలేమితో పాటు ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. జిల్లాపై పట్టు కోసం నాయకుల మధ్య పోటీ పెరగడంతో పార్టీ బలోపేతం పక్కకు వెళ్ళి పంచాయతీలు తెరమీదికి వస్తున్నాయి. ఇవి ముదిరి డీసీసీ అధ్యక్షుల మార్పు దాకా వెళ్తున్నాయి. ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడిని మార్చాలని జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ థాక్రే కి ఫిర్యాదు కూడా చేశారట.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పట్టు సాధించే పనిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వంపై వత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే తాజా వివాదానికి కూడా కారణమట. గతంలో కూడా గ్రూపుల పంచాయతీలే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ని దెబ్బతీశాయి. అదే పునరావృత్తం అవుతున్నట్టు కనపడుతోంది. ప్రేమ్ సాగర్ రావు ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ పై అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారట. జిల్లాలో నియోజకవర్గాల ఇన్చార్జిల ఎంపిక విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి థాక్రే ..ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్కి అసిఫాబాద్ వివాదాన్ని సెటిల్ చేసే బాధ్యత అప్పగించారు. దీంతో బుధవారం ఆయన జిల్లాలో పర్యటించి మండలాల వారీగా సమీక్షలుచేశారు. ఒకటి రెండు రోజుల్లో నివేదిక ఇస్తారని చెబుతుండగా తర్వాత ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ జిల్లా కాంగ్రెస్ నేతల్లో పెరుగుతోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో లంబాడా.. గోండులలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది ప్రధాన సమస్య. ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఓ వర్గం గోండులకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. అదిలాబాద్ జిల్లాలో మరో వర్గం లంబాడీలకు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతోంది. ఇలా రెండు డిమాండ్ల మధ్య నాయకులలో అంతరం పెరుగుతోందట.
Also Read
- పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై 'Telegram'కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
- Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! "లెక్కలు చెప్పండి.. చర్చకు రండి"
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరి సీటుకు వాళ్లు ప్రయత్నం చేసుకోవడం కంటే జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో పట్టు సాధించే పనిలో ఉన్నారు నాయకులు . అందుకే చిన్న పంచాయితీలు కూడా పెద్దవి అవుతున్నాయి. అది ముదిరి ఇప్పుడు ఏకంగా డీసీసీ అధ్యక్షుడిని మార్చమనేదాకా వచ్చింది. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
Super Subbu: నెట్ఫ్లిక్స్లో టాప్ లేపుతోన్న ‘సూపర్ సుబ్బు’.. హిందీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్!
-
Lenin Pre Release Event: రేపే గ్రాండ్గా ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ సస్పెన్స్!
-
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
-
IBPS SO Recruitment 2026: 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. నెలకు రూ.85,000కు పైగా జీతం
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!