Off The Record: ఆ జిల్లాపై పట్టుకోసం కాంగ్రెస్లో కుమ్ములాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెండు అడుగుల ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. నాయకుల మధ్య సమన్వయలేమితో పాటు ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. జిల్లాపై పట్టు కోసం నాయకుల మధ్య పోటీ పెరగడంతో పార్టీ బలోపేతం పక్కకు వెళ్ళి పంచాయతీలు తెరమీదికి వస్తున్నాయి. ఇవి ముదిరి డీసీసీ అధ్యక్షుల మార్పు దాకా వెళ్తున్నాయి. ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడిని మార్చాలని జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ థాక్రే కి ఫిర్యాదు కూడా చేశారట.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పట్టు సాధించే పనిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వంపై వత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే తాజా వివాదానికి కూడా కారణమట. గతంలో కూడా గ్రూపుల పంచాయతీలే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ని దెబ్బతీశాయి. అదే పునరావృత్తం అవుతున్నట్టు కనపడుతోంది. ప్రేమ్ సాగర్ రావు ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ పై అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారట. జిల్లాలో నియోజకవర్గాల ఇన్చార్జిల ఎంపిక విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి థాక్రే ..ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్కి అసిఫాబాద్ వివాదాన్ని సెటిల్ చేసే బాధ్యత అప్పగించారు. దీంతో బుధవారం ఆయన జిల్లాలో పర్యటించి మండలాల వారీగా సమీక్షలుచేశారు. ఒకటి రెండు రోజుల్లో నివేదిక ఇస్తారని చెబుతుండగా తర్వాత ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ జిల్లా కాంగ్రెస్ నేతల్లో పెరుగుతోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో లంబాడా.. గోండులలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది ప్రధాన సమస్య. ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఓ వర్గం గోండులకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. అదిలాబాద్ జిల్లాలో మరో వర్గం లంబాడీలకు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతోంది. ఇలా రెండు డిమాండ్ల మధ్య నాయకులలో అంతరం పెరుగుతోందట.
Also Read
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
- Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరి సీటుకు వాళ్లు ప్రయత్నం చేసుకోవడం కంటే జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో పట్టు సాధించే పనిలో ఉన్నారు నాయకులు . అందుకే చిన్న పంచాయితీలు కూడా పెద్దవి అవుతున్నాయి. అది ముదిరి ఇప్పుడు ఏకంగా డీసీసీ అధ్యక్షుడిని మార్చమనేదాకా వచ్చింది. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
-
Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
-
Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
-
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!