Odisha: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడంటే.?
దేశంలో ఈ మధ్య రైలు ప్రమాదాలు, రైళ్లు పట్టాలు తప్పడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక కారణాలతో పాటు పలు ఇతర కారణాలతో ఈ సంఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అందులో ఉన్న మూడు బోగీలు బోల్తా పడ్డాయి. కొత్తవలస- భీరందుల్ నుంచి ఇనుప ఖనిజంలోడ్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి వెళ్లాల్సి ఉంది. కొరాపుట్- అరకు మార్గంలో ప్రయాణిస్తున్న ఈ గూడ్స్ రైలు పాడువా వద్ద ఈ ప్రమాదం జరిగింది.
READ MORE: Sahya: యూట్యూబర్ మౌనిక రెడ్డి హీరోయిన్గా “సహ్య”.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!
ఈ మార్గంలో రాకపోకలు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ మార్గంలో కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రమాదానికి గురైంది గూడ్స్ రైలు కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాణాలతో ప్రయాణికులు జంకుతున్నారు.
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?