రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపైన కోర్టు మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీనేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆయన మట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో హైకోర్టు ప్రభుత్వానికి అనేక మొట్టికాయలు వేసిందని ఆయన గుర్తు చేశారు. సీఎస్, అక్రమ కట్టడాలు, ఎస్ఐ, కానిస్టేబుల్ అంశాల విషయంలో కోర్టు మొట్టి కాయలు వేసిందన్నారు. గవర్నర్ ప్రసంగంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మూడేకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదన్న వాస్తవాలను ప్రభుత్వం ఒప్పుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించామని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించాలని ఆయన అన్నారు.
Also Read : Stock Markets Today: బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్
ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది, వేతనాలు ఇవ్వలేని దుస్థితిని ప్రభుత్వం ఒప్పుకోవాలని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు, విధులకు కేంద్రం కేటాయించిన నిధులను అపుకున్నది గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నోటీసులు, విచారణలు ఎదుర్కొన్న వారికి ప్రగతి భవన్ నిలయంగా మారిందని, కేంద్రాన్ని, రాజ్ భవన్ను విమర్శించడం కేసీఆర్ సర్కారుకు పరిపాటైందని, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, ఆత్మహత్యలపై గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు పొందు పరచాలన్నారు. అవినీతి,అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తెరపైకి తీసుకువస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
Also Read : Chiru:ఫైట్స్ వేనుమా? ఫైట్స్ ఇరుకు… ఎమోషన్ వేనుమా? ఎమోషన్ ఇరుకు… అదిదా గ్యాంగ్ లీడర్