Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈవీ ఛార్జింగ్ చేస్తుండగా ఒక్కసారిగామంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో మంటలు బిల్డింగ్లోకి వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తూ పలువురిని రక్షించారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో బుధవారం నివాస భవనంలో చెలరేగిన భారీ మంటల్లో ఇద్దరు మృతి చెందగా, సుమారు 50 కుటుంబాలు భవనంలో చిక్కుకుపోయాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి భారీ సహాయక చర్యలు చేపట్టడంతో మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని మమూరా గ్రామంలో ఉన్న జీ+4 నివాస భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక విచారణలో ఎలక్ట్రిక్ బైక్ను ఛార్జింగ్ చేస్తుండగా స్పార్క్ రావడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అనంతరం మంటలు పార్కింగ్లో ఉన్న పెట్రోల్ వాహనాలకు వ్యాపించి భారీ అగ్నిప్రమాదానికి దారితీశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. హైడ్రాలిక్ ప్లాట్ఫారమ్లు, రెస్క్యూ వాహనాలు, ఏడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో నివసిస్తున్న సుమారు 50 కుటుంబాల సభ్యులను సురక్షితంగా బయటకు తరలించారు.
గౌతమ్ బుద్ధ నగర్ జాయింట్ పోలీస్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ మాట్లాడుతూ.. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉండటంతో అక్కడ చెలరేగిన మంటల నుంచి వచ్చిన దట్టమైన పొగ పై అంతస్తులకు వ్యాపించిందని తెలిపారు. పొగ పీల్చుకోవడంతో ఇద్దరి ఆరోగ్యం విషమించడంతో వారిని వెంటనే అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈవీ ఛార్జింగ్ సమయంలో ఏర్పడిన స్పార్క్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని రాజీవ్ నారాయణ్ తెలిపారు. ఈ ఘటనపై ఫేజ్-3 పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, భవన యజమాని, లీజుదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!