Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదన్నకేంద్ర ఉక్కు శాఖ మంత్రి..
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన హెచ్డీ కుమారస్వామి..
- స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడ ప్రజలు.. ఉద్యోగుల సెంటిమెంట్ను గుర్తించా..
- ప్రతి అంశాన్ని ప్రధాని మోడీకి వివరిస్తానన్న ఉక్కుశాఖ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి.. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడ ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంట్ను నేను గుర్తించాను అన్నారు.. ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తాను అన్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై ప్రధానికి నోట్ సమర్పిస్తాను అన్నారు.
Read Also: Bhatti Vikramarka: రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు
Also Read
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
ఇక, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఎవరు చెప్పారు..? అని ప్రశ్నించారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తోసిపుచ్చారు ఉక్కు మంత్రి.. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది అని అర్థమైందన్న ఆయన.. అధ్యయనం కోసం స్టీల్ ప్లాంట్ కు వచ్చాను.. ఇక్కడ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తాను అన్నారు.. కార్మిక కుటుంబాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి వాళ్ల అభిప్రాయాలు నాకు అర్ధం అయ్యిందన్నారు.. ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు, సహాయంతో ఈ ప్లాంట్ 100 శాతం సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి.. కాగా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్టు గతంలో పరిస్థితులు ఏర్పడ్డాయి.. పెట్టుబడుల ఉపసంహరణతో.. ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఇలా అంతా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..