Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ ఎన్నికలు వద్దంటూ తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Plenary Sessions: ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు అవసరం లేదని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఎన్నికల గురించి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చర్చించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. సీడబ్ల్యూసీ సభ్యులందరినీ నియమించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు. స్టీరింగ్ కమిటీ సమావేశంలో 45 మంది సభ్యులు (అందరూ) పాల్గొన్నారని తెలిపారు. వీరిలో కొందరు సీడబ్ల్యూసీ ఎన్నికలకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పోషించవలసిన పాత్రను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనడం కోసం, సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించరాదని నిర్ణయించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన సమావేశంలో అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ సింగ్ వంటి నేతలు ఎన్నికలకు మొగ్గు చూపడంతో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా జరగలేదని పలు వర్గాలు తెలిపాయి. 2024 జాతీయ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని సింఘ్వీ సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, మల్లికార్జున్ ఖర్గేపై పూర్తి విశ్వాసం ఉందని, కాంగ్రెస్ను బలోపేతం చేసేలా ఆయన చేతలను బలోపేతం చేయాలన్నారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక ఖర్గేకు స్వేచ్ఛనివ్వాలని, నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని భావించి కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. అయినప్పటికీ, వారు 2024 ఎన్నికల కోసం మేధోమథనం చేయాలని భావిస్తున్న మిగిలిన సమావేశానికి హాజరవుతారు.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
Read Also: Stock Market Roundup 24-02-23: దేశంలో తొలిసారిగా మునిసిపల్ బాండ్ ఇండెక్స్ ప్రారంభం
వరుస ఎన్నికల పరాజయాలు, సమగ్ర మార్పు, నాయకుల వలసల కోసం సంవత్సరాల అంతర్గత తగాదాల తర్వాత, సోనియా గాంధీ అక్టోబర్లో 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ పగ్గాలను విధేయుడైన మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. పార్టీ మొదటి కుటుంబంగా పరిగణించబడుతున్న గాంధీలు దానిపై గట్టి పట్టును కొనసాగిస్తున్నారు. మూడు రోజుల రాయ్పూర్ సమ్మేళనంలో, పార్టీ 2024 లోక్సభ ఎన్నికలకు రోడ్మ్యాప్ను రూపొందించే కీలక నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి బీజేపీని ఎదుర్కోవడానికి వ్యూహాన్ని ఖరారు చేస్తుందని భావిస్తున్నారు. నాయకత్వ పరివర్తన సమయంలో ప్రస్తుతం కాంగ్రెస్ అత్యున్నత మండలిగా ఉన్న స్టీరింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నాయకులు ఖర్గే నాయకత్వాన్ని ఆమోదించి, ఆయన నేతృత్వంలోని కొత్త వర్కింగ్ కమిటీకి మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!