Nizamabad: గంజాయి స్మగ్లర్ల అరాచకం.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన ఎక్సైజ్ బృందంపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న కానిస్టేబుల్ సౌమ్యను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్ను ఓదార్చారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్గా ఉన్నప్పటికీ.. నిన్నటి కంటే కొంత మెరుగుపడిందని వైద్యులు మంత్రికి వివరించారు.
Also Read
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
- Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప నేతృత్వంలోని సీయిర్ వైద్యుల బృందం సౌమ్యకు అత్యాధునిక చికిత్స అందిస్తోంది. ఆమె కోలుకునే వరకు అయ్యే ఖర్చు, బాధ్యత ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదు. నిందితులపై ఇప్పటికే ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేశామని తెలిపారు. తెలంగాణలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇలాంటి దాడులు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు.
ఈ దారుణ ఘటనపై ఎక్సైజ్ సీఐ స్వప్న సంచలన విషయాలను బయటపెట్టారు. గంజాయి రవాణా అవుతుందన్న సమాచారంతో తాము మాటు వేశామని ఆమె తెలిపారు. మేము స్మగ్లర్ల కారును అడ్డగించినప్పుడు, ఇద్దరు నిందితులు కారు దిగి పారిపోయారు. కానిస్టేబుల్ సౌమ్య కారు బానెట్ ముందు నిలబడి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ నిందితులు కనికరం లేకుండా కారును ఆమెపైకి పోనిచ్చారు. కిందపడిపోయిన సౌమ్యపై నుంచి కారు వెళ్లడమే కాకుండా, మళ్లీ రివర్స్ తీసి రెండోసారి కూడా ఆమెను తొక్కించారని సీఐ స్వప్న కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రస్తుతం సోహెల్, రాహుల్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. వారికి గంజాయి పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మతిన్ మాఫియా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అలాగే తాను స్మగ్లర్లతో కుమ్మక్కయ్యానని వస్తున్న వార్తలను సీఐ స్వప్న తీవ్రంగా ఖండించారు. నేను వారితో చేతులు కలిపి ఉంటే అసలు దాడులకే వెళ్లేదాన్ని కాదు కదా? ఈ అసత్య ప్రచారాలు బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్నెస్కు రెడీ అవ్వండి!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!