Chhattisgarh:103 మంది జవాన్లను పొట్టన బెట్టుకున్న 9 మంది నక్షలైట్లు.. లొంగిపోయారు..
- లొంగిపోయిన 9మంది నక్సలైట్లు
- ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఘటన
- భద్రతా బలగాలపై అనేక దాడులు చేసిన వారే
- 103 మంది జవాన్లను పొట్టన బెట్టుకున్న నక్సలైట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో తొమ్మిది మంది పేరుమోసిన నక్సలైట్లు శనివారం లొంగిపోయారు. వీరంతా భద్రతా బలగాలపై అనేక దాడులకు పాల్పడ్డారు. ఈ నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరావాసం కల్పిస్తారు. గతేడాది బస్తర్ ప్రాంతంలో 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు. సుక్మాతో సహా ఏడు జిల్లాలు ఈ ప్రాంతంలో వస్తాయి.
ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది నక్సలైట్లు పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. మావోయిస్ట్ భావజాలం బోలు, అమానవీయ స్వభావం, సంస్థలో కొనసాగుతున్న అంతర్గత కలహాల వల్ల వారు నిరాశ చెందారు. పోలీసు శిబిరాల ఏర్పాటు కారణంగా, సీనియర్ నక్సలైట్లు వెనక్కి తగ్గారు. మావోయిస్టు ప్లాటూన్ నంబర్ 24 కమాండర్ రాంసాయి అలియాస్ ఓయామ్ బుస్కా (34), ప్రదీప్ అలియాస్ రవ్వ రాకేష్ (20)పై రూ.8 లక్షల రివార్డు ఉంది.
Also Read
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
మరో నలుగురు నక్సలైట్లపై రూ.5 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. మహిళా నక్సలైట్పై మూడు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఒక మహిళతో సహా మరో ఇద్దరిపై రూ.2 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. 2007లో నారాయణపూర్ జిల్లాలోని ఝరా వ్యాలీలో జరిగిన ఆకస్మిక దాడితో సహా అనేక ప్రధాన దాడుల్లో నక్సల్ కమాండర్ రాంసాయ్ పాల్గొన్నాడు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.
దీనితో పాటు.. 2007 సంవత్సరంలో రాణిబోడ్లి (బీజాపూర్ జిల్లా) దాడిలో 55 మంది భద్రతా సిబ్బంది మరణించారు. 2017లో బుర్కాపాల్ (సుక్మా)లో ఆకస్మిక దాడి జరిగింది. ఇందులో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. 2020 సంవత్సరంలో మిన్పా ఆకస్మిక (సుక్మా) దాడిలో 17 మంది భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. లొంగిపోయిన ఇతర నక్సలైట్లు కూడా భద్రతా బలగాలపై అనేక దాడుల్లో పాల్గొన్నారు.
నక్సలైట్ల పేర్లు, రివార్డులు…
1. రాన్సే అలియాస్ మనోజ్ అలియాస్ ఓయం బుస్కా – రూ. 8 లక్షలు
2. ప్రదీప్ అలియాస్ రవ్వ రాకేష్ – రూ. 8 లక్షలు
3. కవాసి సోనా – రూ. 5 లక్షలు
4. నవీన్ అలియాస్ సోడి మంగ – రూ. 5 లక్షలు
5. మడ్కం జోగా – రూ. 5 లక్షలు
6. ముచ్చకీ దేవా – రూ. 5 లక్షలు
7. మద్వి సుక్కి – రూ. 3 లక్షలు
8. కరాటం వెలి – రూ. 2 లక్షలు
9. మద్వి రాకేష్- రూ. 2 లక్షలు
తాజావార్తలు
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?