NIKHAT ZAREEN : ప్రపంచబాక్సింగ్ క్వార్టర్స్ లోకి తెలంగాణ అమ్మాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో అదరగొడుతుంది. టైటిల్ ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ అమ్మాయి మరో అడుగు ముందుకేసింది. నిన్న జరిగిన 50కేజీల ప్రీక్వార్టర్స్ లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్(మెక్సికో)ను చిత్త చేసింది. ఆరంభం నుంచి పంచ్ పవర్ చూపించిన నిఖత్.. ప్రత్యేర్థికి అవకాశమే ఇవ్వలేదు. మంచి పుట్ వర్క్ కు తోడు లెఫ్ట్, రైట్ హుక్ ల మేళవింపుతో దాడికి దిగిన నిఖత్ జరీన్ ముందు ప్యాట్రిసియా తేలిపోయింది. ప్రతి రౌండ్ లోనూ జడ్జ్ లు నిఖత్ కే ఓటేయడంతో ఆమె ఘన విజయం సాధించింది.
Also Read : Kidnap Drama: మార్కులు తక్కువస్తే పేరెంట్స్ తిడతారని భలే స్కెచ్ వేసింది.. కానీ సీన్ రివర్స్
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
మరోవైపు భారత్ కు చెందిన నీతు గాంగాస్ (48కేజీ), మనీషా (57కేజీ), జాస్మిన్ (60కేజీ) క్వార్టర్ ఫైనల్ చేరారు. ప్రీక్వార్టర్స్ లో సుమైయా ఖోసిమోవా ( తజకిస్తాన్ )ను నీతు నాకౌట్ చేసింది. తొలి రౌండ్ లోనే నీతు పంచ్ లకు సుమైనా నిలవలేకపోవడంతో రిఫరీ బౌట్ ను ఆపేశారు. మరో ప్రిక్వార్టర్సలో నూర్ తుర్హాన్( తుర్కియే)పై మనీషా గెలిచింది. ప్రత్యర్థి బాక్సర్ కంటే పొడగరి అయిన మనీషా పదునైన పంచ్ లతో అటాక్ చేసి విజయాన్ని అందుకుంది. మనీషా దూకుడుకు నూర్ ఆటను కొనసాగించలేకపోవడంతో రిఫరీ మ్యాచ్ ను ఆపి భారత్ బ్యాక్సర్ ను విజేతగా ప్రకటించారు. ఇంకో ప్రీ క్యార్టర్స్ లో సమదోవా( తజకిస్తాన్ )ను జాస్మిన్ ఓడించింది. మరోవైపు శశిచోప్రా(63కేజీ), మంజు(66) టోర్నీ నుంచి నిష్ర్కమించారు. కిటో(జపాన్)చేతిలో శశి.. ఖామిదోవా(ఉబ్బెకిస్తాన్)చేతిలో మంజు చిత్తుగా ఓడిపోయారు.
Also Read : Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. వణికిన ఉత్తర భారతం..
కాగా, ఆదివారం ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆఫ్రికన్ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్ రౌమైసాతో నిఖత్ తలపడింది. 5-0 ఏకపక్ష స్కోర్ తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్టర్స్ లో గెలిచింది. మ్యాచ్ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే ఆట మొదటి రౌండ్ లో నిఖత్ కు తన ఆటతీరుతో రెచ్చిపోయింది. దీంతో ఆ రౌండ్ ఆమెకు అనుకూలంగా మారింది. ఎన్నో బాడీ షాట్ల వ్యూహాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. చివరకు 5-0తో వార్ వన్ సైడ్ చేసి విజేతగా నిఖత్ జరీన్ నిలిచింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!