NIKHAT ZAREEN : ప్రపంచబాక్సింగ్ క్వార్టర్స్ లోకి తెలంగాణ అమ్మాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో అదరగొడుతుంది. టైటిల్ ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ అమ్మాయి మరో అడుగు ముందుకేసింది. నిన్న జరిగిన 50కేజీల ప్రీక్వార్టర్స్ లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్(మెక్సికో)ను చిత్త చేసింది. ఆరంభం నుంచి పంచ్ పవర్ చూపించిన నిఖత్.. ప్రత్యేర్థికి అవకాశమే ఇవ్వలేదు. మంచి పుట్ వర్క్ కు తోడు లెఫ్ట్, రైట్ హుక్ ల మేళవింపుతో దాడికి దిగిన నిఖత్ జరీన్ ముందు ప్యాట్రిసియా తేలిపోయింది. ప్రతి రౌండ్ లోనూ జడ్జ్ లు నిఖత్ కే ఓటేయడంతో ఆమె ఘన విజయం సాధించింది.
Also Read : Kidnap Drama: మార్కులు తక్కువస్తే పేరెంట్స్ తిడతారని భలే స్కెచ్ వేసింది.. కానీ సీన్ రివర్స్
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
మరోవైపు భారత్ కు చెందిన నీతు గాంగాస్ (48కేజీ), మనీషా (57కేజీ), జాస్మిన్ (60కేజీ) క్వార్టర్ ఫైనల్ చేరారు. ప్రీక్వార్టర్స్ లో సుమైయా ఖోసిమోవా ( తజకిస్తాన్ )ను నీతు నాకౌట్ చేసింది. తొలి రౌండ్ లోనే నీతు పంచ్ లకు సుమైనా నిలవలేకపోవడంతో రిఫరీ బౌట్ ను ఆపేశారు. మరో ప్రిక్వార్టర్సలో నూర్ తుర్హాన్( తుర్కియే)పై మనీషా గెలిచింది. ప్రత్యర్థి బాక్సర్ కంటే పొడగరి అయిన మనీషా పదునైన పంచ్ లతో అటాక్ చేసి విజయాన్ని అందుకుంది. మనీషా దూకుడుకు నూర్ ఆటను కొనసాగించలేకపోవడంతో రిఫరీ మ్యాచ్ ను ఆపి భారత్ బ్యాక్సర్ ను విజేతగా ప్రకటించారు. ఇంకో ప్రీ క్యార్టర్స్ లో సమదోవా( తజకిస్తాన్ )ను జాస్మిన్ ఓడించింది. మరోవైపు శశిచోప్రా(63కేజీ), మంజు(66) టోర్నీ నుంచి నిష్ర్కమించారు. కిటో(జపాన్)చేతిలో శశి.. ఖామిదోవా(ఉబ్బెకిస్తాన్)చేతిలో మంజు చిత్తుగా ఓడిపోయారు.
Also Read : Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. వణికిన ఉత్తర భారతం..
కాగా, ఆదివారం ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆఫ్రికన్ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్ రౌమైసాతో నిఖత్ తలపడింది. 5-0 ఏకపక్ష స్కోర్ తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్టర్స్ లో గెలిచింది. మ్యాచ్ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే ఆట మొదటి రౌండ్ లో నిఖత్ కు తన ఆటతీరుతో రెచ్చిపోయింది. దీంతో ఆ రౌండ్ ఆమెకు అనుకూలంగా మారింది. ఎన్నో బాడీ షాట్ల వ్యూహాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. చివరకు 5-0తో వార్ వన్ సైడ్ చేసి విజేతగా నిఖత్ జరీన్ నిలిచింది.
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!