Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..
- నవ వధువు పెళ్లైన మూడు నెలలకే
- భర్తకు మత్తు మందు ఇచ్చి
- నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎక్కువై పోయాయి. పెళ్లికి ముందే మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ పెట్టుకుని.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని ఆఖరికి అమాయకులైన భర్తలను కాటికి పంపిస్తున్నారు కొందరు భార్యలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో భర్త ప్రాణాలు తీయడానికి బదులుగా నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లైన మూడు నెలలకే వధువు బండారం బయటపడడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read:Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కార్లకు రూ.38 లక్షల జరిమానా..!
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ఝాన్సీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నవ వధువు, ఆమె ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహం అయిన మూడు నెలల తర్వాత, ఆ మహిళ, తన ప్రేమికుడితో కలిసి, తన భర్తకు మత్తుమందు తినిపించి, స్పృహ కోల్పోయేలా చేసి, బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో ఇంట్లో నుంచి పారిపోయింది. సిటీ కొత్వాలి ప్రాంతంలోని నయా బస్తీలో నివసించే నావల్ కిషోర్ చిన్న కుమారుడు యశ్వంత్, పూంచ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమరోఖ్ గ్రామానికి చెందిన రీనాను వివాహం చేసుకున్నాడు. మ్యారేజ్ జరిగిన మూడు నెలల తర్వాత, జూన్ 1న, రీనా మొదట తన భర్త యశ్వంత్ కు మత్తుమందు తినిపించి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడు రింకుతో కలిసి ఇంట్లో ఉంచిన నగలు, దాదాపు 50 వేల రూపాయలను తీసుకుని పారిపోయింది.
Also Read:Singareni BTPS : మణుగూరులో బూడిద వర్షం.. కాలుష్యంపై ప్రజల్లో ఆందోళనలు
తేరుకున్న భర్త, అతని కుటుంబ సభ్యులు నావల్ కిషోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్, ఆపై దొంగతనం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో, రీనా, రింకు ఇప్పటికే ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ అమరోఖ్ గ్రామ నివాసితులని తేలింది. పోలీసులు ఆ ప్రదేశాన్ని గుర్తించి సూరత్ నుంచి వారిద్దరినీ అరెస్టు చేశారు. వారు ఎత్తుకెళ్లిన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీలసులు తెలిపారు.
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!