Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..
- నవ వధువు పెళ్లైన మూడు నెలలకే
- భర్తకు మత్తు మందు ఇచ్చి
- నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎక్కువై పోయాయి. పెళ్లికి ముందే మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ పెట్టుకుని.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని ఆఖరికి అమాయకులైన భర్తలను కాటికి పంపిస్తున్నారు కొందరు భార్యలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో భర్త ప్రాణాలు తీయడానికి బదులుగా నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లైన మూడు నెలలకే వధువు బండారం బయటపడడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read:Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కార్లకు రూ.38 లక్షల జరిమానా..!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఝాన్సీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నవ వధువు, ఆమె ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహం అయిన మూడు నెలల తర్వాత, ఆ మహిళ, తన ప్రేమికుడితో కలిసి, తన భర్తకు మత్తుమందు తినిపించి, స్పృహ కోల్పోయేలా చేసి, బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో ఇంట్లో నుంచి పారిపోయింది. సిటీ కొత్వాలి ప్రాంతంలోని నయా బస్తీలో నివసించే నావల్ కిషోర్ చిన్న కుమారుడు యశ్వంత్, పూంచ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమరోఖ్ గ్రామానికి చెందిన రీనాను వివాహం చేసుకున్నాడు. మ్యారేజ్ జరిగిన మూడు నెలల తర్వాత, జూన్ 1న, రీనా మొదట తన భర్త యశ్వంత్ కు మత్తుమందు తినిపించి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడు రింకుతో కలిసి ఇంట్లో ఉంచిన నగలు, దాదాపు 50 వేల రూపాయలను తీసుకుని పారిపోయింది.
Also Read:Singareni BTPS : మణుగూరులో బూడిద వర్షం.. కాలుష్యంపై ప్రజల్లో ఆందోళనలు
తేరుకున్న భర్త, అతని కుటుంబ సభ్యులు నావల్ కిషోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్, ఆపై దొంగతనం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో, రీనా, రింకు ఇప్పటికే ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ అమరోఖ్ గ్రామ నివాసితులని తేలింది. పోలీసులు ఆ ప్రదేశాన్ని గుర్తించి సూరత్ నుంచి వారిద్దరినీ అరెస్టు చేశారు. వారు ఎత్తుకెళ్లిన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీలసులు తెలిపారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?