Singareni BTPS : మణుగూరులో బూడిద వర్షం.. కాలుష్యంపై ప్రజల్లో ఆందోళనలు
- మణుగూరులో రాత్రి కురిసిన బూడిద వర్షం
- సింగరేణి, బిటిపీఎస్ ప్రభావంపై స్థానికుల ఆరోపణలు
- వర్షపు నీటిలో నల్లటి బూడిద.. ప్రజల్లో భయాందోళనలు
- పర్యావరణ కాలుష్యంపై ఆందోళనలు, ఆరోగ్య సమస్యల భయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni BTPS : వర్షాలు రావడం లేదని అక్కడి వారు భావిస్తుంటే ఒక్క సారిగా రాత్రి కురిసిన వర్షానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం అక్కడ కురిసిన బారీ వర్షంలో బూడిద రాలడమే.. అరా కొరాగా కాదు సుమండి.. భారీగా బూడిద వర్షంతో వచ్చి పడింది. బూడిద వర్షంతో అక్కడి ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. ప్రధానంగా బారీ వర్షంలో కూడ బకెట్లు బకెట్లు నిండేంత స్థాయిలో బూడిద కురవడం ఆందోళనల చెందిన పరిస్థితి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ మండలంలో గత రాత్రి కురిసిన వర్షానికి బూడిద వర్షం కురిసింది. అసలు బూడిద వర్షం ఏమిటి అన్న అనుమానాలు రావచ్చు.. కాని ఇది నిజం… ఇక్కడ ఇలా బూడిద వర్షానికి కారణం బిటిపిఎస్ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటి నుంచో ఇక్కడ సింగరేణి మైన్స్, ఓపెన్ కాస్టు గనులు ఉన్నప్పటికి ఏనాడు కూడ ఇటువంటి పరిస్తితి కనిపించలేదు. ఎప్పుడు రోడ్ల మీద సింగరేణి బొగ్గు వంటి పదార్ధాలు కనిపిస్తుంటాయి. కాని వర్షంలో బూడిద తో కూడి రావడం మాత్రం ఎప్పుడురాలేదు. అందువల్లనే ఇక్కడ ఈ బూడిద వర్షం పట్ల ఇక్కడ ప్రజలు ఆందోళనల చెందుతున్నారు. మణుగూర్ ఏరియాలో ఇప్పటికే సింగరేణి ఓపన్ కాస్టు గనులు ఉన్నాయి. అదే విదంగా అశ్వాపురం వద్ద బార జల కార్మాగారం ఉంది. పక్కనే జీవ నది గోదావరి ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతం కూడ బాగా ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికి ఇక్కడ వాతవరణం మాత్రం పొల్యూషన్ గా మారిపోయింది.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
బూడిద పొడి వర్షం కురవడం చాలా అరుదు. ఇలాంటి సంఘటనలు అడవి మంటలు, అగ్నిపర్వతాలు ప్రాంతాల్లో ఎక్కువగా చోటుచేసుకుంటాయి. కానీ అలాంటిది ఏమి లేకపోయినా తాజాగా పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో సంభవించడం ఇక్కడ ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భద్రాది కొత్తగూడెం జిల్లా సింగరేణి, భద్రాది ధర్మల్ విద్యుత్ కేంద్రం నెలకొన్నప్పటికీ వాటి యొక్క ప్రభావమే మణుగూరు లో శివలింగాపురం, బాపన కుంట, రాజుపేట విటల్ రామ్ నగర్, గాంధీ బొమ్మ సెంటర్ మరి కొన్ని ప్రాంతాల్లో ఈ బూడిద వర్షానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. సింగరేణి గనుల వల్లనే ఇప్పటికే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ బిటిపిస్ దర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడ ఏర్పాటు చేశారు. ఈధర్మల్ విద్యుత్ కేంద్రానికి పెద్ద ఎత్తున లారీల్లో బొగ్గు తరలి వెళుతుంది. ఆ లారీల నుంచి పడే బొగ్గు దుమ్మ కూడ గాలిలో కలిసి పోతుంది. మణుగూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ దుమ్ముతో వాహన దారుల, ఇళ్లులు నల్లగా మారిపోతుంది. ఎవ్వరైనా బయటకు వచ్చి ఇంటికి వెళ్లే లోపులోనే బూడిద తో నల్లగా బట్టలు మారిపోతాయి. అంతలా ఇక్కడ బూడిద ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా గత రాత్రి పందొమ్మిది సెంటీమీటర్ల వర్షంకురిసింది. అంత బారీ స్థాయిలో కురిసిన వర్షంలో బూడిద వర్షం కనిపించకుండా పోవలసి ఉంటుంది. కాని ఇక్కడ బూడిద బూడిద గా వర్షంనీళ్లురావడం ఆలోచించాల్సిన విషమని అంటున్నారు. అటు ములుగు, బూపాలపల్లి జిల్లాల మీదుగా వచ్చిన వర్షం మణుగూర్ లో కూడ పెద్ద స్థాయిలో కురిసింది. గత రాత్రి మణుగూర్ లోని అనేక ప్రాంతాలు వర్షం వల్ల ముంపుకు గురయ్యాయి. వాడల్లోకి నీళ్లు వచ్చి చేరాయి.
ఇదే సందర్బంలో గత రాత్రి కురిసిన వర్షం నుంచి బూడిద కూడ రాలి ప డింది. చాలా మంది ఇళ్ల మీద బూడిద తో కూడిన వర్షం పడింది. ఇది చూసి పట్టణ వాసులు ఆశ్చర్య పోయారు. ముఖ్యంగా నలుపు మేఘాల్లో నుండి నల్లటి బూడిద వర్షం ఈ ప్రాంతంలో కురిసింది. మణుగూర్ పరిసర ప్రాంతాల్లోని శివలింగాపురం, బాపనుకుంటా, గాంధీ బొమ్మ సెంటర్, రాజుపేట , పీకే వన్ సెంటర్ లో కలుషితమైన బూడిద నీరు ప్రవహించింది. ఈ క్రమంలో కొందరు కురిసిన వాన నీటిని పట్టుకుందామని బకెట్లు గిన్నెలు పెట్టడంతో నల్లటి బూడిద రంగు వలె నీరు కనిపించింది. మణుగూరు ఏరియాలో బూడిద పొడి వర్షం కురవడం తో రహదారులు, నివాస గృహాల్లో బూడిద కుప్పలు కుప్పలుగా మేట వేసింది. అంతేకాకుండా మణుగూరు లో ఇలాగే బూడిద పొడి వర్షం కురిస్తే ఈ ప్రాంత ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు నని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి బూడిద వర్షం ఎప్పుడూ చూడలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!