Radha Murder Case: రాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. కారుతో తొక్కించి.. రాళ్లతో మోది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి సుధాకర్ రెడ్డి.. సెల్ లొకేషన్ ద్వారా జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద రాధ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. రాధను కారుతో ఢీకొట్టి, రాయితో మోదీ అతి కిరాతకంగా హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.. రాధ హత్య కేసులో ఆమె స్నేహితుడు కాశిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. ఆర్థిక వ్యవహారంలో గత కొద్దికాలంగా స్నేహితునితో రాధకు విభేదాలు ఉన్నట్టు చెబుతున్నారు. రాధ స్నేహితుడు కాశిరెడ్డి మరికొందరితో కలసి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మరోవైపు.. కాశిరెడ్డి కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.. రాధ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన నేపథ్యంలో రిపోర్ట్ వస్తే మరికొన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.. ఇక, రాధను కారుతో తొక్కించటం కంటే ముందు.. దుండగులు ఆమెను కొంతదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు, వారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినట్లు ఘటనా స్థలంలో పోలీసులకు ఆనవాళ్లు లభించాయి. రాధ శరీరమంతా ఉన్న గాయాల ఆనవాళ్లను పరిశీలిస్తే నలుగురైదుగురు వ్యక్తులు దారుణంగా చంపినట్లుగా భావిస్తున్నారు.. వెలిగండ్ల మండలం గుండ్లోపల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డికి తన కుమార్తె, అల్లుడు రూ.50 లక్షల అప్పు ఇచ్చారని, అతనే తన అనుచరులతో కలిసి తమ కుమార్తెను హత్య చేసి ఉంటారంటూ రాధ తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, సుధాకర్రెడ్డి చెబుతున్నారు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!