Radha Murder Case: రాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. కారుతో తొక్కించి.. రాళ్లతో మోది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి సుధాకర్ రెడ్డి.. సెల్ లొకేషన్ ద్వారా జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద రాధ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. రాధను కారుతో ఢీకొట్టి, రాయితో మోదీ అతి కిరాతకంగా హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.. రాధ హత్య కేసులో ఆమె స్నేహితుడు కాశిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. ఆర్థిక వ్యవహారంలో గత కొద్దికాలంగా స్నేహితునితో రాధకు విభేదాలు ఉన్నట్టు చెబుతున్నారు. రాధ స్నేహితుడు కాశిరెడ్డి మరికొందరితో కలసి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
మరోవైపు.. కాశిరెడ్డి కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.. రాధ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన నేపథ్యంలో రిపోర్ట్ వస్తే మరికొన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.. ఇక, రాధను కారుతో తొక్కించటం కంటే ముందు.. దుండగులు ఆమెను కొంతదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు, వారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినట్లు ఘటనా స్థలంలో పోలీసులకు ఆనవాళ్లు లభించాయి. రాధ శరీరమంతా ఉన్న గాయాల ఆనవాళ్లను పరిశీలిస్తే నలుగురైదుగురు వ్యక్తులు దారుణంగా చంపినట్లుగా భావిస్తున్నారు.. వెలిగండ్ల మండలం గుండ్లోపల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డికి తన కుమార్తె, అల్లుడు రూ.50 లక్షల అప్పు ఇచ్చారని, అతనే తన అనుచరులతో కలిసి తమ కుమార్తెను హత్య చేసి ఉంటారంటూ రాధ తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, సుధాకర్రెడ్డి చెబుతున్నారు..
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!