Stock Market : స్టాక్ మార్కెట్ కొత్త రికార్డు.. సెన్సెక్స్ 72000 దిశగా, 21500 దాటిన నిఫ్టీ
Stock Market : సెన్సెక్స్ ఈరోజు మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్ 72000, నిఫ్టీ 21500 దాటాయి. ఈరోజు సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది. 21543 స్థాయిలో ప్రారంభమైంది. బుధవారం సెన్సెక్స్ 210 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 90 పాయింట్లు లాభపడింది. అంతకుముందు మంగళవారం, సెన్సెక్స్ ఆల్ టైమ్ 71623.7కి చేరుకుంది. డిసెంబర్ 8వ తేదీనే 21000 పాయింట్ల స్థాయిని దాటి ప్రస్తుతం 22000 వేల దిశగా పయనిస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో నిఫ్టీలో 2900 పాయింట్ల భారీ జంప్ కనిపించింది. డిసెంబర్ 30, 2022న ఇది 18,105 స్థాయిలో ఉంది.
Read Also:Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఎక్కడ స్ట్రీమింగంటే?
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 71832 వద్ద సరికొత్త శిఖరాన్ని తాకింది. ఇది జరిగిన కొద్దిసేపటికే సెన్సెక్స్ మరో కొత్త గరిష్ట స్థాయి 71866కు చేరుకుంది. కాగా, నిఫ్టీ 21577 వద్దకు చేరుకుంది. బీఎస్ఈలో 2701 స్టాక్లు ట్రేడవుతున్నాయి. వీటిలో ఎరుపు రంగులో 527, ఆకుపచ్చ రంగులో 2096 మాత్రమే ఉన్నాయి. ఈ కాలంలో 113 స్టాక్లు అప్పర్ సర్క్యూట్లో, 43 లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. ఇది కాకుండా 187 స్టాక్లు 52 వారాల గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతుండగా 8 మాత్రమే కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Read Also:RBI Penalty: బ్యాంకులపై ఆర్బీఐ కొరడా.. జరిమానాల వల్ల కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ?
నిఫ్టీ టాప్ గెయినర్స్లో టెక్ మహీంద్రా 1.92 శాతం పెరిగి రూ.1306కు చేరుకుంది. ఎల్టీఐ మైండ్ ట్రీ 1.48 శాతం పెరిగి రూ.6203.40 వద్ద ఉంది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లు కూడా ఒక శాతానికిపైగా పెరిగాయి. కాగా, నిఫ్టీ టాప్ లూజర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ ఉన్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ షేర్లు కూడా పెరుగుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్లో, అదానీ ఎనర్జీ సొల్యూషన్ 4.46 శాతం పెరిగి రూ.1124.20కి చేరుకుంది. అదానీ పవర్ దాదాపు 0.36 శాతం పెరిగి రూ.537.40 వద్ద ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2951.60కి చేరుకుంది. కాగా, ఈరోజు కూడా అదానీ టోటల్ గ్యాస్ 0.77 శాతం పెరిగి రూ.1034.20 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.1542.90 వద్ద ఉంది. అదానీ పోర్ట్ కూడా 0.60 శాతం పెరిగి రూ.1080.45 వద్ద ట్రేడవుతోంది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!