Rajasthan: రాజస్థాన్లో కొత్త చట్టం.. రోడ్డుపై శవంతో నిరసన తెలిపితే రెండేళ్లు జైలు శిక్ష
రాజస్థాన్లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు ‘రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023’. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది. ఆ బిల్లులో మృతదేహానికి మతం ప్రకారం అంత్యక్రియలు చేసే హక్కు ఇచ్చారు. మృతదేహాలను నిరసన కార్యక్రమాల్లో ఉపయోగిస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించే నిబంధనను రూపొందించారు. మరోవైపు కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా మృతదేహాన్ని నిరసన కోసం ఉపయోగిస్తే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
అంతేకాకుండా మృతదేహాన్ని నిరసనల్లో ఉపయోగిస్తే.. మృతదేహాన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కు అప్పగిస్తామని ఆ చట్టంలో ఉంది. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఉంది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా మృతదేహం అంత్యక్రియలను 24 గంటల్లో నిర్వహించాలని మృతుల బంధువులకు నోటీసులు పంపిస్తారు. మరోవైపు తమ న్యాయబద్ధమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాష్ట్రంలో ఏదో ఒక అంశంపై మృతదేహాలను ఉంచే సంఘటనలను అరికట్టడానికి మాత్రమే ప్రభుత్వం చట్టం చేసిందని నిరసనకారులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యాలు, తప్పిదాల కారణంగా చాలాసార్లు కొందరు ప్రాణాలు వదులుకోవాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమానికి భయపడి ప్రభుత్వం ఇలా చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Tamannaah Bhatia: తెలంగాణ కోడలు కాబోతున్న తమన్నా.. మరి విజయ్ పరిస్థితి..?
న్యాయం కోసం మృతదేహాలతో రోడ్లపై నిరసన చేయడం మనం ఎన్నోసార్లు చూశాం. అలాంటప్పుడు మానవత్వం మరియు నైతికత గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. మరోవైపు బిజెపి రాజ్యసభ ఎంపి కిరోడి లాలా మీనా మాట్లాడుతూ.. మృతదేహాలతో నిరసన చేయడమనేది.. సరైన పద్ధతి కాదన్నారు. చట్టవిరుద్ధమైన కేసులలో మరణించిన పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అందుకు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మృతదేహానికి గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం ఈ చట్టం రూపొందించింది.
తాజావార్తలు
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!