Rajasthan: రాజస్థాన్లో కొత్త చట్టం.. రోడ్డుపై శవంతో నిరసన తెలిపితే రెండేళ్లు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు ‘రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023’. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది. ఆ బిల్లులో మృతదేహానికి మతం ప్రకారం అంత్యక్రియలు చేసే హక్కు ఇచ్చారు. మృతదేహాలను నిరసన కార్యక్రమాల్లో ఉపయోగిస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించే నిబంధనను రూపొందించారు. మరోవైపు కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా మృతదేహాన్ని నిరసన కోసం ఉపయోగిస్తే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అంతేకాకుండా మృతదేహాన్ని నిరసనల్లో ఉపయోగిస్తే.. మృతదేహాన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కు అప్పగిస్తామని ఆ చట్టంలో ఉంది. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఉంది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా మృతదేహం అంత్యక్రియలను 24 గంటల్లో నిర్వహించాలని మృతుల బంధువులకు నోటీసులు పంపిస్తారు. మరోవైపు తమ న్యాయబద్ధమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాష్ట్రంలో ఏదో ఒక అంశంపై మృతదేహాలను ఉంచే సంఘటనలను అరికట్టడానికి మాత్రమే ప్రభుత్వం చట్టం చేసిందని నిరసనకారులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యాలు, తప్పిదాల కారణంగా చాలాసార్లు కొందరు ప్రాణాలు వదులుకోవాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమానికి భయపడి ప్రభుత్వం ఇలా చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Tamannaah Bhatia: తెలంగాణ కోడలు కాబోతున్న తమన్నా.. మరి విజయ్ పరిస్థితి..?
న్యాయం కోసం మృతదేహాలతో రోడ్లపై నిరసన చేయడం మనం ఎన్నోసార్లు చూశాం. అలాంటప్పుడు మానవత్వం మరియు నైతికత గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. మరోవైపు బిజెపి రాజ్యసభ ఎంపి కిరోడి లాలా మీనా మాట్లాడుతూ.. మృతదేహాలతో నిరసన చేయడమనేది.. సరైన పద్ధతి కాదన్నారు. చట్టవిరుద్ధమైన కేసులలో మరణించిన పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అందుకు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మృతదేహానికి గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం ఈ చట్టం రూపొందించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!