Rajasthan: రాజస్థాన్లో కొత్త చట్టం.. రోడ్డుపై శవంతో నిరసన తెలిపితే రెండేళ్లు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు ‘రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023’. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది. ఆ బిల్లులో మృతదేహానికి మతం ప్రకారం అంత్యక్రియలు చేసే హక్కు ఇచ్చారు. మృతదేహాలను నిరసన కార్యక్రమాల్లో ఉపయోగిస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించే నిబంధనను రూపొందించారు. మరోవైపు కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా మృతదేహాన్ని నిరసన కోసం ఉపయోగిస్తే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
అంతేకాకుండా మృతదేహాన్ని నిరసనల్లో ఉపయోగిస్తే.. మృతదేహాన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కు అప్పగిస్తామని ఆ చట్టంలో ఉంది. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఉంది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా మృతదేహం అంత్యక్రియలను 24 గంటల్లో నిర్వహించాలని మృతుల బంధువులకు నోటీసులు పంపిస్తారు. మరోవైపు తమ న్యాయబద్ధమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాష్ట్రంలో ఏదో ఒక అంశంపై మృతదేహాలను ఉంచే సంఘటనలను అరికట్టడానికి మాత్రమే ప్రభుత్వం చట్టం చేసిందని నిరసనకారులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యాలు, తప్పిదాల కారణంగా చాలాసార్లు కొందరు ప్రాణాలు వదులుకోవాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమానికి భయపడి ప్రభుత్వం ఇలా చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Tamannaah Bhatia: తెలంగాణ కోడలు కాబోతున్న తమన్నా.. మరి విజయ్ పరిస్థితి..?
న్యాయం కోసం మృతదేహాలతో రోడ్లపై నిరసన చేయడం మనం ఎన్నోసార్లు చూశాం. అలాంటప్పుడు మానవత్వం మరియు నైతికత గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. మరోవైపు బిజెపి రాజ్యసభ ఎంపి కిరోడి లాలా మీనా మాట్లాడుతూ.. మృతదేహాలతో నిరసన చేయడమనేది.. సరైన పద్ధతి కాదన్నారు. చట్టవిరుద్ధమైన కేసులలో మరణించిన పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అందుకు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మృతదేహానికి గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం ఈ చట్టం రూపొందించింది.
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!