Rajasthan: రాజస్థాన్లో కొత్త చట్టం.. రోడ్డుపై శవంతో నిరసన తెలిపితే రెండేళ్లు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు ‘రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023’. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది. ఆ బిల్లులో మృతదేహానికి మతం ప్రకారం అంత్యక్రియలు చేసే హక్కు ఇచ్చారు. మృతదేహాలను నిరసన కార్యక్రమాల్లో ఉపయోగిస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించే నిబంధనను రూపొందించారు. మరోవైపు కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా మృతదేహాన్ని నిరసన కోసం ఉపయోగిస్తే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
అంతేకాకుండా మృతదేహాన్ని నిరసనల్లో ఉపయోగిస్తే.. మృతదేహాన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కు అప్పగిస్తామని ఆ చట్టంలో ఉంది. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఉంది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా మృతదేహం అంత్యక్రియలను 24 గంటల్లో నిర్వహించాలని మృతుల బంధువులకు నోటీసులు పంపిస్తారు. మరోవైపు తమ న్యాయబద్ధమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాష్ట్రంలో ఏదో ఒక అంశంపై మృతదేహాలను ఉంచే సంఘటనలను అరికట్టడానికి మాత్రమే ప్రభుత్వం చట్టం చేసిందని నిరసనకారులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యాలు, తప్పిదాల కారణంగా చాలాసార్లు కొందరు ప్రాణాలు వదులుకోవాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమానికి భయపడి ప్రభుత్వం ఇలా చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Tamannaah Bhatia: తెలంగాణ కోడలు కాబోతున్న తమన్నా.. మరి విజయ్ పరిస్థితి..?
న్యాయం కోసం మృతదేహాలతో రోడ్లపై నిరసన చేయడం మనం ఎన్నోసార్లు చూశాం. అలాంటప్పుడు మానవత్వం మరియు నైతికత గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. మరోవైపు బిజెపి రాజ్యసభ ఎంపి కిరోడి లాలా మీనా మాట్లాడుతూ.. మృతదేహాలతో నిరసన చేయడమనేది.. సరైన పద్ధతి కాదన్నారు. చట్టవిరుద్ధమైన కేసులలో మరణించిన పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అందుకు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మృతదేహానికి గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం ఈ చట్టం రూపొందించింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?