Nara Lokesh meets Amit Shah: మొంథా తుఫాన్ నష్టం రూ.6,352 కోట్లు.. అమిత్షాకు లోకేష్ నివేదిక..
- మొంథా తుపాను నష్టం రూ.6,352 కోట్లు..
- కేంద్రానికి ఏపీ ప్రభుత్వ నివేదిక..
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత భేటీ..
- తుపాను నష్టంపై పూర్తి నివేదికను కేంద్రానికి అందజేసిన లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh meets Amit Shah: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నష్టాన్నే మిగిల్చింది.. ఇప్పటికే ప్రాథమిక అంచనాలపై కేంద్రానికి నివేదిక చేరగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు.. మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తుపాను నష్టాలపై పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు ఆంధ్రప్రదేశ్ ఐటీ, పురపాలక శాఖ మంత్రి నారా లోకేష్. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రి లోకేష్, రాష్ట్ర హోంమంత్రి అనిత సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావం, పునరావాస చర్యలు, నష్టపరిహారం అవసరాలపై సమగ్ర వివరాలు లోకేష్ అందించారు. తుపాను వల్ల మొత్తం రూ.6,352 కోట్ల నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.
Also Read
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
మొంథా తుపాను మొత్తం 3,109 ప్రభావిత గ్రామాల్లో ప్రభావం చూపించింది.. తుపాను తీరం దాటి సమయం: అక్టోబర్ 28 రాత్రి, కాకినాడ సమీపంలో గాలి వేగం గంటకు 100 కి.మీ వేగంతో ఉంది.. అయితే, పునరావాస చర్యల్లో 1.92 లక్షల మందిని 2,471 శిబిరాలకు తరలించాం.. తుపాను అనంతరం ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వెంటనే రూ.3,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం పంపిణీ చేసింది. అదేవిధంగా, కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ, తాగునీటి సరఫరా వంటి అత్యవసర చర్యలు చేపట్టినట్లు లోకేష్ వివరించారు. అత్యవసర అవసరాల నిమిత్తం రూ.60 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసినట్లు తెలిపారు.
రంగాల వారీగా నష్టం ఇలా:
వ్యవసాయ రంగం – రూ.271 కోట్లు
గృహ నష్టం – రూ.7 కోట్లు
రహదారులు & మౌలిక వసతులు- రూ.4,324 కోట్లు
విద్యుత్ రంగం- రూ. 41 కోట్లు
నీటిపారుదల & నీటి వనరులు – రూ.369 కోట్లు
శాశ్వత నిర్మాణాలు- రూ.1,302 కోట్లు
సామూహిక ఆస్తులు-రూ.48 కోట్లు
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..