Nara Lokesh meets Amit Shah: మొంథా తుఫాన్ నష్టం రూ.6,352 కోట్లు.. అమిత్షాకు లోకేష్ నివేదిక..
- మొంథా తుపాను నష్టం రూ.6,352 కోట్లు..
- కేంద్రానికి ఏపీ ప్రభుత్వ నివేదిక..
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత భేటీ..
- తుపాను నష్టంపై పూర్తి నివేదికను కేంద్రానికి అందజేసిన లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh meets Amit Shah: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నష్టాన్నే మిగిల్చింది.. ఇప్పటికే ప్రాథమిక అంచనాలపై కేంద్రానికి నివేదిక చేరగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు.. మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తుపాను నష్టాలపై పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు ఆంధ్రప్రదేశ్ ఐటీ, పురపాలక శాఖ మంత్రి నారా లోకేష్. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రి లోకేష్, రాష్ట్ర హోంమంత్రి అనిత సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావం, పునరావాస చర్యలు, నష్టపరిహారం అవసరాలపై సమగ్ర వివరాలు లోకేష్ అందించారు. తుపాను వల్ల మొత్తం రూ.6,352 కోట్ల నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
మొంథా తుపాను మొత్తం 3,109 ప్రభావిత గ్రామాల్లో ప్రభావం చూపించింది.. తుపాను తీరం దాటి సమయం: అక్టోబర్ 28 రాత్రి, కాకినాడ సమీపంలో గాలి వేగం గంటకు 100 కి.మీ వేగంతో ఉంది.. అయితే, పునరావాస చర్యల్లో 1.92 లక్షల మందిని 2,471 శిబిరాలకు తరలించాం.. తుపాను అనంతరం ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వెంటనే రూ.3,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం పంపిణీ చేసింది. అదేవిధంగా, కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ, తాగునీటి సరఫరా వంటి అత్యవసర చర్యలు చేపట్టినట్లు లోకేష్ వివరించారు. అత్యవసర అవసరాల నిమిత్తం రూ.60 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసినట్లు తెలిపారు.
రంగాల వారీగా నష్టం ఇలా:
వ్యవసాయ రంగం – రూ.271 కోట్లు
గృహ నష్టం – రూ.7 కోట్లు
రహదారులు & మౌలిక వసతులు- రూ.4,324 కోట్లు
విద్యుత్ రంగం- రూ. 41 కోట్లు
నీటిపారుదల & నీటి వనరులు – రూ.369 కోట్లు
శాశ్వత నిర్మాణాలు- రూ.1,302 కోట్లు
సామూహిక ఆస్తులు-రూ.48 కోట్లు
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!