CM Revanth Reddy : విద్యా రంగంలో మరో భారీ అడుగు.. తెలంగాణలో కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలు
- ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 571 కొత్త పాఠశాలలు ఏర్పాటు
- హైస్కూల్ స్థాయిలోనే నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీసీ కేంద్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ, ఇతర అవసరాల విషయంలో వ్యయానికి వెనుకాడమని తేల్చిచెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట్ల కొత్త పాఠశాలలు నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.
Also Read
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
హైస్కూల్ స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్లో తాము కోరుకునే రంగాల్లో విజయం సాధించేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే భాషా పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించేలా విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.
Dil Raju : 2014 – 2023 సినిమా హీరో హీరోయిన్ దర్శకులకు కూడా అవార్డులు!
పట్టణీకరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, హెచ్ఎండీఏ, మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ భూముల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాసంస్థలను హేతుబద్దీకరించి, ప్రతి పాఠశాలలో సరైన సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
గురుకుల పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు వల్ల విద్యార్థులు అక్కడికి ఆకర్షితులవుతున్నారని, అదే విధంగా డే స్కాలర్లకూ ఈ వసతులు అందించే అవకాశం పరిశీలించాలని అధికారులను కోరారు. పిల్లలలో కుటుంబం, సమాజం పట్ల అవగాహన పెంచేందుకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. దీనివల్ల వారు మానసింకగా దృఢంగా తయారై బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని సీఎం అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..