Konathala Ramakrishna: పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. ఎన్డీయే కూటమిదే గెలుపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీనీ కలపడంతో జనసేన సఫలీ కృతమైంది.. దానికి లోకసత్తా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు.. జయ ప్రకాశ్ నారాయణకు ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. ఇక, ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి.. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా పెండింగ్ లో ఉన్నాయి.. వెనుకబడిన ప్రాంతం, వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర.. ఆదాయం తక్కువుగా ఉన్న ప్రాంతం.. ఉత్తరాంధ్ర అభివృద్ది సాధించాలంటే ప్రతి ఎకరాకు నీరు రావాలంటే.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి అని కొణతాల రామకృష్ణ వెల్లడించారు.
Read Also: Karnataka : పోలీసులపై కోపంతో స్టేషన్ పై గ్రామస్తుల దాడి.. 25 మంది అరెస్ట్
Also Read
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
- Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
ఇక, గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుకబడింది అని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. వంశధార, సుజల స్రవంతి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి.. తండ్రి మొదలు పెట్టిన ప్రాజెక్టులైనా.. కనీసం కొడుగుకుగా కూడా పూర్తి చేయలేకపోయాడు.. ఇది చాలా దురదృష్టకరం.. పోలవరం కూడా పెండింగ్ లోనే ఉంది. ఆల్రెడీ కట్టిన కాఫర్ డాం డ్యామేజ్ అయింది.. నిర్వాసితులకు కూడా డబ్బులు చెల్లించలేదు.. ప్రాజెక్టుల విషయంలో బడ్జెట్ లో ఒక లెక్కలు.. ఖర్చుపెట్టినవి ఒక లెక్కలు అని ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని చిన్న చూపు చూశారు.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇవ్వాలని కోరుతున్నాం.. ప్రజలు మంచి తీర్పు ఇవ్వబోతున్నారు.. మంచి రోజులు వస్తున్నాయని కొణతాల పేర్కొన్నారు.
Read Also: Actress Sukanya: విడాకులు తీసుకున్నా.. తను నా కూతురు కాదు!
కాగా, మోడీ సహకారంతో మన ప్రాంతాన్ని, అంధ్రా రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోబోతున్నామని కొణతాల రామకృష్ణ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ది కార్యక్రమాలు జరగాలనీ కోరుతున్నాం.. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది అన్నది ఎజెండాలో లేకుండా పోయింది.. ప్రభుత్వ డబ్బును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు.. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత నష్టపోయామో.. అంతకు వంద రేట్లు ఈ ఐదేళ్లలో నష్టపోయాం.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అభివృద్ది లేదు.. ఇంకా వేరే జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆరోపించారు. కేఫ్టిల్ ఇన్వెస్ట్మెంట్ పది శాతం పైనే ఉండాలి.. కానీ ఆరు శాతం మించలేదు.. జ్యూట్ మిల్లులు సైతం కనుమరుగై పోయాయి.. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు అనేవి ప్రభుత్వ విధానాలపైన ఆధారపడి ఉంటాయి.. ఈ ప్రభుత్వంలో పదిసార్లకు పైనే విద్యుత్ చార్జీలు పెంచారు.. దీంతో అవి కూడా నష్టాల్లో ఉన్నాయి.. పాలన మొదలు పెట్టడమే విధ్వంసంతో పెట్టారని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
-
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
-
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
-
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
-
Anirudh : టాలీవుడ్ ప్రొడ్యూసర్ల ‘అనిరుధ్’ జపం.. ఏకంగా రూ. 25 కోట్లకు చేరిన రెమ్యునరేషన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!