Karnataka : పోలీసులపై కోపంతో స్టేషన్ పై గ్రామస్తుల దాడి.. 25 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka : కర్ణాటకలోని దావణగెరెలోని చన్నగిరి పోలీస్ స్టేషన్పై అల్లరి మూక దాడికి సంబంధించి 25 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. శనివారం పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి (ఆదిల్) మరణించిన తర్వాత, ఒక ఛాందసవాద మూకలు చన్నగిరి పోలీస్ స్టేషన్పై దాడి చేశాయి. పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కనీసం 11 మంది పోలీసులు గాయపడ్డారని అధికారి తెలిపారు. కేసును సీఐడీకి అప్పగించారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇప్పటికే ఉన్న వీడియో క్లిప్ల ఆధారంగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మూకుమ్మడి దాడికి పాల్పడిన వ్యక్తులపై ఐపీసీ 353, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసు కస్టడీలో చనిపోయిన ఆదిత్
మరోవైపు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గ్యాంబ్లింగ్కు సంబంధించిన కేసులో ఆదిల్ను మే 24న అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించాడు. ఆదిల్ మరణవార్త అతని కుటుంబ సభ్యులకు తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పు పెట్టారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
Read Also:Actress Sukanya: విడాకులు తీసుకున్నా.. తను నా కూతురు కాదు!
డిప్యూటీ ఎస్పీ, సబ్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
అదే సమయంలో పోలీస్ స్టేషన్పై దాడి అనంతరం చన్నగిరి డిప్యూటీ ఎస్పీ, సబ్ ఇన్స్పెక్టర్లు సస్పెన్షన్కు గురయ్యారు. పోలీస్ స్టేషన్పై దాడి ఘటనకు సంబంధించి డిప్యూటీ ఎస్పీ, ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర ఆదివారం తెలిపారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఘటన జరగకూడదు. ఇందులో నిర్లక్ష్యం కనిపించింది. విచారణకు ఆదేశించారు.
విచారణకు హోంమంత్రి ఆదేశాలు
విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదిల్ గ్యాంబ్లింగ్లో పాల్గొంటున్నందున పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జి పరమేశ్వర్ తెలిపారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి మృతి చెందింది. ఎందుకు, ఎలా చనిపోయాడన్నది పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తుందన్నారు. అతను గుండెపోటు కారణంగా చనిపోవచ్చు. అయితే విచారణకు ఆదేశించారు.
Read Also:Maheshwar Reddy: ఉత్తమ్ కుమార్ పై ఫైర్ అయిన మహేశ్వర్ రెడ్డి
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!