Nayantara : ధనుష్ తో గొడవ.. చిరంజీవి,చరణ్, షారుఖ్ లకు థ్యాంక్స్ చెప్పిన నయన్
- చిరుకు కృతజ్ఞతలు చెప్పిన నయనతార
- నెట్ ఫ్లిక్స్ లో నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్
- ధనుష్ తో వివాదం కారణంగా ముఖ్యాంశాల్లో లేడీ సూపర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayantara : నయనతార డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇటీవల నయన్ తార, ధనుష్ ల మధ్య వివాదం ఏమేరకు వైరల్ అయిందో తెలిసిందే. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ను విమర్శిస్తూ నయన్ మూడు పేజీల బహిరంగ లేఖ రాసింది. అయితే ఇప్పుడు ఇదే విషయమై మెగాస్టార్ చిరంజీవి, బాద్ షా షారూఖ్ ఖాన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తన 20 ఏళ్ల కెరీర్లో తనకు సపోర్ట్గా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నయన్ పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్లో షారుక్కి, టాలీవుడ్లో చిరంజీవి, రామ్ చరణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తన డాక్యుమెంటరీ కోసం ఈ ముగ్గురిని సంప్రదించగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. ఇంతలో, నయనతార పేర్కొన్న దర్శకులు, నిర్మాతలలో షారుఖ్, చిరు, చరణ్, అలాగే తెలుగు, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.
Read Also:Tamil Nadu: చితిపై నుంచి ఒక్కసారిగా పైకి లేచిన 65 ఏళ్ల వృద్ధురాలు.. అసలు ఏం జరిగింది?
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
‘‘నేను పనిచేసిన ప్రతి సినిమాకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.. నా సినిమా ప్రయాణం నాకు లెక్కలేనన్ని సంతోషకరమైన క్షణాలను అందించింది. వీటిలో చాలా సినిమాలు నా మనసుకు దగ్గరయ్యాయి. ఆ జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలని నిర్మాతలను సంప్రదించినప్పుడు.. వాళ్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు..ధన్యవాదాలు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నటి నయనతార తన డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ ప్రవర్తనపై విమర్శలు చేసింది. ధనుష్ రూ.10కోట్లు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. డాక్యుమెంటరీ ట్రైలర్లో నానుమ్ రౌడీ డాన్కి సంబంధించిన మూడు సెకన్ల క్లిప్లను ఉపయోగించినందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు ఆమె తెలిపారు. ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయంపై ధనుష్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో తన డాక్యుమెంటరీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ నయనతార మరోసారి కృతజ్ఞతలు చెప్పడంతో ఇప్పుడు ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
Read Also:Amazon Offers: కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ స్మార్ట్ టీవీపై 30 వేల తగ్గింపు!
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!