Nayantara : ధనుష్ తో గొడవ.. చిరంజీవి,చరణ్, షారుఖ్ లకు థ్యాంక్స్ చెప్పిన నయన్
- చిరుకు కృతజ్ఞతలు చెప్పిన నయనతార
- నెట్ ఫ్లిక్స్ లో నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్
- ధనుష్ తో వివాదం కారణంగా ముఖ్యాంశాల్లో లేడీ సూపర్ స్టార్
Nayantara : నయనతార డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇటీవల నయన్ తార, ధనుష్ ల మధ్య వివాదం ఏమేరకు వైరల్ అయిందో తెలిసిందే. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ను విమర్శిస్తూ నయన్ మూడు పేజీల బహిరంగ లేఖ రాసింది. అయితే ఇప్పుడు ఇదే విషయమై మెగాస్టార్ చిరంజీవి, బాద్ షా షారూఖ్ ఖాన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తన 20 ఏళ్ల కెరీర్లో తనకు సపోర్ట్గా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నయన్ పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్లో షారుక్కి, టాలీవుడ్లో చిరంజీవి, రామ్ చరణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తన డాక్యుమెంటరీ కోసం ఈ ముగ్గురిని సంప్రదించగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. ఇంతలో, నయనతార పేర్కొన్న దర్శకులు, నిర్మాతలలో షారుఖ్, చిరు, చరణ్, అలాగే తెలుగు, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.
Read Also:Tamil Nadu: చితిపై నుంచి ఒక్కసారిగా పైకి లేచిన 65 ఏళ్ల వృద్ధురాలు.. అసలు ఏం జరిగింది?
Also Read
- E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
- Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
‘‘నేను పనిచేసిన ప్రతి సినిమాకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.. నా సినిమా ప్రయాణం నాకు లెక్కలేనన్ని సంతోషకరమైన క్షణాలను అందించింది. వీటిలో చాలా సినిమాలు నా మనసుకు దగ్గరయ్యాయి. ఆ జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలని నిర్మాతలను సంప్రదించినప్పుడు.. వాళ్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు..ధన్యవాదాలు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నటి నయనతార తన డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ ప్రవర్తనపై విమర్శలు చేసింది. ధనుష్ రూ.10కోట్లు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. డాక్యుమెంటరీ ట్రైలర్లో నానుమ్ రౌడీ డాన్కి సంబంధించిన మూడు సెకన్ల క్లిప్లను ఉపయోగించినందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు ఆమె తెలిపారు. ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయంపై ధనుష్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో తన డాక్యుమెంటరీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ నయనతార మరోసారి కృతజ్ఞతలు చెప్పడంతో ఇప్పుడు ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
Read Also:Amazon Offers: కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ స్మార్ట్ టీవీపై 30 వేల తగ్గింపు!
తాజావార్తలు
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో