Narendra Modi : రేపు ఎల్లుండి తెలంగాణలో మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని మోడీకి తెలంగాణ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను బీజేపీ విడుదల చేసింది. రేపు ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మోడీ….11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ ప్రధాని మోడీ పాల్గొంటారు. మధ్యాహ్నం తమిళ్ నాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు రాత్రి రాజ్ భవన్ లో బస చేస్తారు ప్రధాని మోడీ. 5 వ తేదీన సంగారెడ్డిలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలు దేరనున్న మోడీ.. 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన లు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. 11.30 నుండి 12.15 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటన తర్వాత ఒడిషాకు పీఎం మోడీ వెళ్లనున్నారు. మొత్తం 15 వేల 718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు మోడీ.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ను కలిసిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే
Also Read
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్గా ఘనత..
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
ఇందులో ఆదిలాబాద్ లో 6,697 కోట్లు, సంగారెడ్డిలో 9,021 కోట్లు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. బేగం పేట లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. లింగం పల్లి నుండి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ ను కూడా ప్రధాని రేపు ఎల్లుండి ప్రారంభిస్తారు. వీటితో పాటు ఎన్టీపీసీని ప్రారంభించనున్నారు. అయితే.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు కన్నా ముందు ప్రధాని రాష్ట్రానికి వస్తుండడం తో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు… కాంగ్రెస్ పై న ఎలాంటి కామెంట్స్ చేస్తారు అనే దాని పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ లో ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోడీ పూరించనున్నారు. అయితే.. నిన్ననే లోక్ సభ ఎన్నికల కోసం ముందుగానే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.. ప్రధాని పర్యటన నేపథ్యం లో ఏర్పాటు ల పై దృష్టి పెట్టారు రాష్ట్ర బీజేపీ నాయకులు.
Pakistan: సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని పాకిస్తాన్ తీర్మానం..
తాజావార్తలు
-
Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్గా ఘనత..
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!