Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Nara Lokesh Slams False Email Ap Government Change Targets Investment Efforts

Nara Lokesh: ప్రభుత్వం మారిపోతుందని ఈ-మెయిల్‌ పంపారు.. ఎవరా అని చూస్తే..!

Published Date :July 31, 2025 , 7:34 pm
By Sampath Kumar
  • ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్
  • ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు ఉన్నారు
  • సింగపూర్ ప్రభుత్వంతో 1995 నుంచి సీఎంకి అనుబంధం ఉంది
  • సింగపూర్‌లో మంచి స్పందన వచ్చింది
Nara Lokesh: ప్రభుత్వం మారిపోతుందని ఈ-మెయిల్‌ పంపారు.. ఎవరా అని చూస్తే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్‌లో పర్యటన చేస్తుంటే.. కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్‌ ప్రభుత్వానికి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్‌ పంపించారని తెలిపారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని, వారితో ఒప్పందాలు చేసుకోవద్దు అందులో పేర్కొన్నారని చెప్పారు. మురళీ కృష్ణ ఎవరా అని చూస్తే.. పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో ఉండే వ్యక్తి అని తెలిసిందన్నారు. యువతకి ఉద్యోగాలు రావాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారన్నారు. సీఎం సింగపూర్‌ పర్యటన విజయవంతమైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్. 2019-24లో ఆ బ్రాండ్‌ను నాశనం చేశారు. సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేసేందుకు ముందుకి వస్తే వాటిని రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒక రాష్ట్రం, ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. అమరావతిలో క్వాంటం సెంటర్లు ఏర్పాటు, గోదావరి జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధి, విశాఖలో ఐటీ హబ్స్, మెడికల్ రంగాలు.. ఇలా ప్రాంతాల వారిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం ముందుకి తీసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు ఉన్నారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశంలో అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మనకు వస్తుంది. డేటా సెంటర్‌ని దేశంలో ఏర్పాటు చేయాలంటే సెక్యూరిటీతో ఉండే విధంగా విశాఖలో ఏర్పాటు చేయాలనీ అనుకున్నాము. విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేలా అనేక కార్పొరేట్ సంస్థలతో మాట్లాడటం జరిగింది’ అని తెలిపారు.

Also Read: Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!

‘దావోస్ పర్యటనలో కూడా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకి రావాలని కోరాము. సింగపూర్ ప్రభుత్వంతో 1995 నుంచి సీఎం చంద్రబాబుకి అనుబంధం ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుకి గౌరవం ఇస్తుంది. గతంలో సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే గత ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ నష్ట పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు మంత్రులని కలవడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, 26 కార్యక్రమాలలో పాల్గొనడం, ఫిల్డ్ విజిట్స్ చేయటం జరిగింది. అనేక సంస్థల ప్రతినిధులని కలవడం జరిగింది. యువతకి ఉద్యోగాలు రావాలని చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్‌లో పర్యటన చేస్తుంటే కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని చెడగొట్టే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారు. చంద్రబాబుని చూసి ఇతర రాష్ట్రాల మంత్రులు ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు. మేము ఒక కమిట్‌మెంట్‌తో పని చేస్తుంటే వైసీపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని దెబ్బ తీసేలా చేస్తోంది. సింగపూర్‌లో మంచి స్పందన వచ్చింది. స్పీడ్ ఆఫ్ బిజినెస్లో భాగంగా నేరుగా జీవోలు జారీ చేస్తున్నాము. విశాఖలో భారతి సిమెంట్స్, హెరిటేజ్ కి ఇవ్వలేదు. ఉద్యోగ ఉపాధి కలిపించేందుకు విశాఖలో ఐటీ హబ్స్ ఏర్పాటు కొరకు తక్కువ ధరకే భూములు కేటాయిస్తున్నాము. పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా అనేక విప్లవత్మక నిర్ణయాలు తీసుకుంటోంది’ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • cm chandrababu
  • Murali Krishna
  • Nara Lokesh
  • tdp

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions