Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
- నాకు సొంత అన్న లేని లోటును పవన్ అన్న తీర్చారు
- మీరు రపరపా అంటే చూస్తూ ఊరుకోము
- జగన్ పేరులో G అంటే జెన్జీ కాదు, గొడ్డలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా దామినీడు వేదికగా శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముఖ్య అథిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రప్పారప్పా అంటే తాము చూస్తూ ఊరుకోమని, రెడ్బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని ప్రతిపక్షంకు వార్నింగ్ ఇచ్చారు.
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ‘ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అన్న’ అని పేర్కొన్నారు. తనకు సొంత అన్న లేని లోటును పవన్ అన్న తీర్చారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. ‘ఇప్పుడు ఏపీలో భూతులు లేవు, జేసీబీలు లేవు. అక్రమాలు, దౌర్జన్యాలు కనిపించడం లేదు. ప్రజలకు రెండేళ్లుగా స్వాతంత్ర్యం లభించింది’ అని పేర్కొన్నారు.
Also Read
- Sachin Tendulkar: "ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!" ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
- Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
- Rohit Sharma: వయసు పెరిగినా జోరు తగ్గలేదు.. రికార్డుల పుస్తకాల్లోకి మరోసారి 'హిట్ మ్యాన్'..
గతంలో తాను చేపట్టిన పాదయాత్రలో దేవుడితో పెట్టుకోవద్దు అని చెప్పానని, ఆ మాటలను పట్టించుకోకుండా వ్యవహరించిన వారి పరిస్థితి ఇప్పుడు అందరికీ కనిపిస్తోందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీతో పోల్చిన లోకేష్.. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన లోకేష్.. ‘టీడీపీ జెండా లేకుండా చేస్తామని చెప్పారు. కానీ ప్రజలే వారి జెండాను పీకేశారు’ అని అన్నారు. ప్రస్తుతం కొందరు ‘రప్పారప్పా’ అంటూ హెచ్చరికలు చేస్తున్నారని.. అయితే తాము చూస్తూ కూర్చోమన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.
అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మధ్య తేడాను వివరిస్తూ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మాది గూగుల్ అయితే.. వారిది గొడ్డలి. మనది కియా అయితే.. వారిది కిడ్నాప్’ అని విమర్శించారు. అలాగే ‘జగన్ అంటే జెన్-జీ కాదు, జగన్ అంటే గొడ్డలి’ అంటూ ఎద్దేవా చేశారు. జగన్కు క్రెడిట్ తీసుకునే అలవాటు ఉందని ఆరోపించిన లోకేష్.. ‘రానున్న రోజుల్లో స్వాతంత్ర్యాన్ని కూడా మా తాత తెచ్చాడని జగన్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. దేశానికి వచ్చే ప్రతి రూ.100 పెట్టుబడుల్లో రూ.25 ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!