Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
- నాకు సొంత అన్న లేని లోటును పవన్ అన్న తీర్చారు
- మీరు రపరపా అంటే చూస్తూ ఊరుకోము
- జగన్ పేరులో G అంటే జెన్జీ కాదు, గొడ్డలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా దామినీడు వేదికగా శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముఖ్య అథిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రప్పారప్పా అంటే తాము చూస్తూ ఊరుకోమని, రెడ్బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని ప్రతిపక్షంకు వార్నింగ్ ఇచ్చారు.
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ‘ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అన్న’ అని పేర్కొన్నారు. తనకు సొంత అన్న లేని లోటును పవన్ అన్న తీర్చారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. ‘ఇప్పుడు ఏపీలో భూతులు లేవు, జేసీబీలు లేవు. అక్రమాలు, దౌర్జన్యాలు కనిపించడం లేదు. ప్రజలకు రెండేళ్లుగా స్వాతంత్ర్యం లభించింది’ అని పేర్కొన్నారు.
Also Read
- Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
గతంలో తాను చేపట్టిన పాదయాత్రలో దేవుడితో పెట్టుకోవద్దు అని చెప్పానని, ఆ మాటలను పట్టించుకోకుండా వ్యవహరించిన వారి పరిస్థితి ఇప్పుడు అందరికీ కనిపిస్తోందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీతో పోల్చిన లోకేష్.. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన లోకేష్.. ‘టీడీపీ జెండా లేకుండా చేస్తామని చెప్పారు. కానీ ప్రజలే వారి జెండాను పీకేశారు’ అని అన్నారు. ప్రస్తుతం కొందరు ‘రప్పారప్పా’ అంటూ హెచ్చరికలు చేస్తున్నారని.. అయితే తాము చూస్తూ కూర్చోమన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.
అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మధ్య తేడాను వివరిస్తూ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మాది గూగుల్ అయితే.. వారిది గొడ్డలి. మనది కియా అయితే.. వారిది కిడ్నాప్’ అని విమర్శించారు. అలాగే ‘జగన్ అంటే జెన్-జీ కాదు, జగన్ అంటే గొడ్డలి’ అంటూ ఎద్దేవా చేశారు. జగన్కు క్రెడిట్ తీసుకునే అలవాటు ఉందని ఆరోపించిన లోకేష్.. ‘రానున్న రోజుల్లో స్వాతంత్ర్యాన్ని కూడా మా తాత తెచ్చాడని జగన్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. దేశానికి వచ్చే ప్రతి రూ.100 పెట్టుబడుల్లో రూ.25 ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!