Muchumarri Incident: ముచ్చుమర్రి కేసు రీకన్స్ట్రక్షన్.. వెలుగులోకి కీలక విషయాలు
- ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో వివరాలను వెల్లడించిన పోలీసులు
- బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని ఎస్పీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muchumarri Incident: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మీడియాకు వెల్లడించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ముచ్చుమర్రిలో 7వ తేదీన బాలిక మిస్ అయిందని.. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక కోసం వెతికామని ఆయన తెలిపారు. ముచ్చుమర్రిలో ముగ్గురు మైనర్లు బాలికను అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారని వివరించారు. మృతదేహం కోసం అన్ని రకాలుగా గాలించామన్నారు. ఈ కేసులో ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశామని.. అనంతరం గ్యాంగ్ రేప్, మర్డర్ కేసుగా మార్చామన్నారు.
Read Also: Maharashtra: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల్లో బాలికతో సహా నలుగురు మైనర్లు..
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
“బాలిక మృతదేహానికి బండరాయి కట్టి వనమాలపాడు వద్ద కృష్ణానదిలో పడేశారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఉన్నవారిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.” అని ఎస్పీ అన్నారు. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశామని ఎస్పీ తెలిపారు. ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి మర్డర్ చేశారని.. హత్య చేసి కంప చెట్లలో పడేశాక పెద్దవాళ్లకు సమాచారం ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. కేసు నుంచి పిల్లలను కాపాడేందుకు నేరస్థుల్లో ఒకరి తండ్రి, మరొకరి పెదనాన్న మృతదేహాన్ని నదిలో పడేశారని ఎస్పీ చెప్పారు. మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా చెప్పారు. ఒక చిన్నారి చెప్పిన సమాచారంతోనే నిందితులు ఎవరో బయటపడిందని.. మృతురాలితో పాటు ఒక బాలిక కూడా ఆ రోజు ఆడుకునేందుకు పార్కుకి వెళ్ళిందని పోలీసులు తెలిపారు. ఆ పాపనే నిందితులను గుర్తించిందన్నారు.
పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచిచారు. పిల్లలు సెల్ఫోన్ వీడియోలు చూసే ఈ నేరానికి పాల్పడ్డారని.. పార్కులో చాక్లెట్ ఇచ్చి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని చెప్పారు. పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులు మృతదేహాన్ని నదిలో వేశారని ఎస్పీ మీడియాకు వివరించారు.
తాజావార్తలు
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?