Muchumarri Incident: ముచ్చుమర్రి కేసు రీకన్స్ట్రక్షన్.. వెలుగులోకి కీలక విషయాలు
- ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో వివరాలను వెల్లడించిన పోలీసులు
- బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని ఎస్పీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muchumarri Incident: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మీడియాకు వెల్లడించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ముచ్చుమర్రిలో 7వ తేదీన బాలిక మిస్ అయిందని.. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక కోసం వెతికామని ఆయన తెలిపారు. ముచ్చుమర్రిలో ముగ్గురు మైనర్లు బాలికను అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారని వివరించారు. మృతదేహం కోసం అన్ని రకాలుగా గాలించామన్నారు. ఈ కేసులో ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశామని.. అనంతరం గ్యాంగ్ రేప్, మర్డర్ కేసుగా మార్చామన్నారు.
Read Also: Maharashtra: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల్లో బాలికతో సహా నలుగురు మైనర్లు..
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
“బాలిక మృతదేహానికి బండరాయి కట్టి వనమాలపాడు వద్ద కృష్ణానదిలో పడేశారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఉన్నవారిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.” అని ఎస్పీ అన్నారు. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశామని ఎస్పీ తెలిపారు. ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి మర్డర్ చేశారని.. హత్య చేసి కంప చెట్లలో పడేశాక పెద్దవాళ్లకు సమాచారం ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. కేసు నుంచి పిల్లలను కాపాడేందుకు నేరస్థుల్లో ఒకరి తండ్రి, మరొకరి పెదనాన్న మృతదేహాన్ని నదిలో పడేశారని ఎస్పీ చెప్పారు. మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా చెప్పారు. ఒక చిన్నారి చెప్పిన సమాచారంతోనే నిందితులు ఎవరో బయటపడిందని.. మృతురాలితో పాటు ఒక బాలిక కూడా ఆ రోజు ఆడుకునేందుకు పార్కుకి వెళ్ళిందని పోలీసులు తెలిపారు. ఆ పాపనే నిందితులను గుర్తించిందన్నారు.
పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచిచారు. పిల్లలు సెల్ఫోన్ వీడియోలు చూసే ఈ నేరానికి పాల్పడ్డారని.. పార్కులో చాక్లెట్ ఇచ్చి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని చెప్పారు. పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులు మృతదేహాన్ని నదిలో వేశారని ఎస్పీ మీడియాకు వివరించారు.
తాజావార్తలు
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!