Muchumarri Incident: ముచ్చుమర్రి కేసు రీకన్స్ట్రక్షన్.. వెలుగులోకి కీలక విషయాలు
- ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో వివరాలను వెల్లడించిన పోలీసులు
- బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని ఎస్పీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muchumarri Incident: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మీడియాకు వెల్లడించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ముచ్చుమర్రిలో 7వ తేదీన బాలిక మిస్ అయిందని.. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక కోసం వెతికామని ఆయన తెలిపారు. ముచ్చుమర్రిలో ముగ్గురు మైనర్లు బాలికను అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారని వివరించారు. మృతదేహం కోసం అన్ని రకాలుగా గాలించామన్నారు. ఈ కేసులో ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశామని.. అనంతరం గ్యాంగ్ రేప్, మర్డర్ కేసుగా మార్చామన్నారు.
Read Also: Maharashtra: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల్లో బాలికతో సహా నలుగురు మైనర్లు..
Also Read
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
- Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
“బాలిక మృతదేహానికి బండరాయి కట్టి వనమాలపాడు వద్ద కృష్ణానదిలో పడేశారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఉన్నవారిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.” అని ఎస్పీ అన్నారు. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశామని ఎస్పీ తెలిపారు. ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి మర్డర్ చేశారని.. హత్య చేసి కంప చెట్లలో పడేశాక పెద్దవాళ్లకు సమాచారం ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. కేసు నుంచి పిల్లలను కాపాడేందుకు నేరస్థుల్లో ఒకరి తండ్రి, మరొకరి పెదనాన్న మృతదేహాన్ని నదిలో పడేశారని ఎస్పీ చెప్పారు. మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా చెప్పారు. ఒక చిన్నారి చెప్పిన సమాచారంతోనే నిందితులు ఎవరో బయటపడిందని.. మృతురాలితో పాటు ఒక బాలిక కూడా ఆ రోజు ఆడుకునేందుకు పార్కుకి వెళ్ళిందని పోలీసులు తెలిపారు. ఆ పాపనే నిందితులను గుర్తించిందన్నారు.
పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు సూచిచారు. పిల్లలు సెల్ఫోన్ వీడియోలు చూసే ఈ నేరానికి పాల్పడ్డారని.. పార్కులో చాక్లెట్ ఇచ్చి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని చెప్పారు. పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులు మృతదేహాన్ని నదిలో వేశారని ఎస్పీ మీడియాకు వివరించారు.
తాజావార్తలు
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
ట్రెండింగ్
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!