Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- ప్రియురాలి కోసం బరితెగించిన మైనర్
- ఐఫోన్ కొనేందుకు భారీ దోపిడీ
- పోలీసులకు అడ్డంగా దొరికిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలిసీతెలియని వయసులో కొందరు పిల్లలు ఏం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. వ్యామోహమో.. లేదంటే బడాయి కోసమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. మీసాలు కూడా రాని వయసులోనే ప్రేమలో పడుతున్నారు. అంతటితో ఆగుతున్నారంటే అది లేదు. ప్రేయసిని మెప్పించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది.
ఓ మైనర్కు ప్రియురాలు ఉంది. ఐఫోన్ బహుమతి ఇవ్వాలని ఆమె కోరింది. అంతే తడువుగా చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా కొనిస్తానని మాటిచ్చాడు. అయితే ప్రేయసికి ఎలాగైనా ఐఫోన్ కొనాలని పూనుకున్నాడు. బుర్రకు పదునుపెట్టి భారీ దోపిడీకి స్కెచ్ గీశాడు. దీనికి తన స్నేహితుల సాయం కోరాడు. అంతే తడువుగా ఓ గిడ్డంగిలో రూ.12 లక్షల విలువైన సామాగ్రి దొంగిలించారు. పాపం పండి అడ్డంగా దొరికిపోయారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
నాగ్పూర్లోని లకడ్గంజ్ ప్రాంతానికి చెందిన రాహుల్ జైచంద్కు కల్మానా ప్రాంతంలో ‘రాహుల్ సిరామిక్స్ ప్రైవేటు లిమిటెడ్’’ పేరుతో టైల్, శానిటరీ వేర్, సిపి ఫిట్టింగ్స్ గిడ్డంగి ఉంది. అయితే మే 27-28 తేదీల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు పైకప్పు రేకుల షీట్లను తొలగించి రూ.12 లక్షల విలువైన అత్యంత ఖరీదైన శానిటరీ ఉత్పత్తులను దొంగలించారు. దీంతో రాహుల్ జైచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీరియస్గా తీసుకున్న కలమ్నా పోలీసుల దర్యాప్తు బృందం.. సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. మొత్తానికి మైనర్ దొంగలను పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే దొంగతనాన్ని ఛేదించారు.
పోలీసులు షాక్
ఈ కేసులో ప్రధాన అనుమానితుడితో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను క్షుణ్ణంగా విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దొంగతనానికి చెప్పిన కారణం తెలుసుకుని పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రేయసికి ఖరీదైన ఐఫోన్ కొనివ్వాలనుకున్నామని, అందుకు తమకు డబ్బు అత్యవసరమని ఒప్పుకున్నారు. ఆ కోరికతోనే గిడ్డంగిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగిలించిన విలాసవంతమైన డిజైనర్ కుళాయిలను ఒక వీధి వ్యాపారికి కేవలం 20,000 రూపాయలకే అమ్మినట్లు మైనర్లు చెప్పారు. వస్తువులను కొనుగోలు చేసిన ప్రధాన నిందితుడు.. 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీ అలియాస్ ఇమ్ము రంజాన్ అలీని పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల నుంచి రూ. 6.5 లక్షల విలువైన విలాసవంతమైన డిజైనర్ ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!