Naa saami Ranga : ” నా సామి రంగ ” ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ “నా సామిరంగ”. ఇందులో నాగ్కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ హీరోయిన్గా చేసింది.నా సామిరంగ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న నాగార్జున నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 న ఆదివారం గ్రాండ్ గా విడుదల అయింది..ఇప్పటికే మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ మరియు వెంకటేష్ సైంధవ్ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి.తాజాగా నాగార్జున నా సామిరంగ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది.ఇదిలా ఉంటే నా సామిరంగ ఓటీటీ డీల్ మరియు ఓటీటీ పార్ట్నర్ వంటి విషయాలు లీక్ అవడం ఆసక్తిగా మారింది. నా సామిరంగ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నా సామిరంగ డిజిటల్ రైట్స్ కోసం మూవీ నిర్మాతలకు డిస్నీ హాట్ స్టార్ భారీ మొత్తంలో డబ్బు చెల్లించిందని టాక్ వినిపిస్తోంది.
ఇక నా సామిరంగ సినిమాను థియేటర్లో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. అంటే, వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో నా సామిరంగ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఒక్కసారి ఓటీటీ సంస్థలు సినిమా హక్కులు కొనుగోలు చేస్తే వాటిని విడుదల చేసే నిర్ణయం వారి చేతుల్లోనే ఉంటుందని సమాచారం.. కొన్నిసార్లు నిర్మాతలతో చర్చించి కూడా ఎప్పుడూ ఓటీటీలో రిలీజ్ చేయాలో ప్లాన్ చేసుకుంటారు.ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అయితే.. నా సామిరంగ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు. నా సామిరంగ మూవీ టాక్ మరియు బాక్సాఫీస్ కలెక్షన్స్ దృష్ట్యా విడుదల తేదీలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నా సామిరంగ సినిమాలో నాగ్ తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా ప్రధాన పాత్రలు పోషించారు.నాగ్ కు జోడీగా ఆషికా రంగనాథ్ నటించగా.. రాజ్ తరుణ్ కి జోడిగా రుక్సార్ దిల్లాన్ మరియు అల్లరి నరేష్ కు జోడిగా మిర్నా మీనన్ నటించారు.
Also Read
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!