Vasantha vs Deveneni: వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం పాలిటిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha vs Deveneni: మైలవరం టీడీపీలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. పోటా పోటీ కార్యక్రమాల దెబ్బకి టీడీపీ క్యాడర్లో హైరానా మొదలైనట్లు తెలుస్తోంది. దేవినేని ఉమ, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. మండల స్థాయి నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్లో టచ్లోకి వెళ్లారు. అయితే, వసంత కృష్ణ ప్రసాద్ ఇంతవరకు టీడీపీలో చేరలేదు.అంతేకాకుండా దేవినేని ఉమతో తనకు ఎలాంటి విబేధాలు లేవంటున్నారు వసంత. రేపు టీడీపీలో చేరేందుకు తన వర్గం నేతలతో హైదరాబాద్ వెళ్తున్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
Read Also: Harirama Jogaiah: జనసేన సహకారం లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యం
Also Read
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ సైతం మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మైలవరం టికెట్పై దేవినేనికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని చర్చ జరుగుతోంది. దీంతో మైలవరం నియోజకవర్గం కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. ఓవైపు వసంత కృష్ణ ప్రసాద్, మరోవైపు దేవినేని ఉమ.. మైలవరం టికెట్ నాదే అంటే నాదే అంటూ ప్రచారం చేసుకోవడంతో.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ అయోమయంలో పడిపోయింది. ఇంతకీ మైలవరం టీడీపీ అభర్థి ఎవరో త్వరగా తేల్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ నియోజక వర్గంలో ఎన్నికల శంఖారావం నిర్వహిస్తున్నారు దేవినేని ఉమా. ఇంకా అధిష్ఠానం టికెట్ ఖరారు చేయకపోవడంతో ఎవరికి వారు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఉమాను చంద్రబాబు పిలిచి మాట్లాడితే బాబు మాటే శిరోధార్యం అని దేవినేని ఉమా చెప్పినట్లు తెలిసిది. ఉమా కార్యక్రమాలపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఉమా, వసంత మధ్య సయోధ్య కుదరకపోతే పార్టీ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..