Margani Bharat: కుట్ర చేసి పింఛన్లు ఆపారు.. ఇంటికి తీసుకెళ్లి ఇస్తే తప్పేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: ఎన్నికల సమయంలో ఏపీలో ఫించన్లు నిలుపుదలపై పొలిటికల్ హీట్ పెరుగుతుంది.. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును తప్పుబడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీనిపై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్ రామ్.. సీఎం వైఎస్ జగన్ ఇవాళ పెన్షన్ పంపిస్తారని వృద్ధులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుట్రపన్ని ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసి పింఛన్లు నిలిపివేశారని ఆరోపించారు. వృద్ధాప్యంలో ఉన్న వారి ఇంటికి వెళ్లి ఓటు తీసుకుని ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. కానీ, పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇస్తే తప్పేంటి…? అని నిలదీశారు.
Read Also: Kumari Aunty : చదువుపై కుమారి ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే.
Also Read
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
చంద్రబాబు ఎంతమందిని పొట్టన పెట్టుకోనున్నారు అని విమర్శించారు భరత్ రామ్.. ఎందుకు పెన్షన్ పంపిణీ అడ్డుకుంటున్నారు.. వాలంటీర్లను ఎందుకు దొంగల్లా చూస్తున్నారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవటానికి 10 గంటలు లైన్లో నుంచోవాల్సిన పరిస్థితి ఉండేది.. అవ్వ తాతలకు ఇవ్వాల్సిన పెన్షన్ అడ్డుకున్న వ్యక్తి నరరూప రాక్షసుడైన చంద్రబాబే అంటూ ఆరోపించారు. ఇక, ఒక టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడిన ఆయన.. చంద్రబాబుది పూర్తిగా పెత్తందారి మనస్తత్వం అని దుయ్యబట్టారు. చంద్రబాబు లాంటి వ్యక్తుల వల్ల సమాజం భ్రష్టు పట్టి పోతుంది.. హైదరాబాదులో ఉంటారు ఆంధ్రాలో రాజకీయాలు చేస్తారు అని సెటైర్లు వేశారు. గతంలో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏ సాధించారు? అని నిలదీశారు. పొత్తుతో 2024లో సాధించబోయేది ఏమిటో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి అని డిమాండ్ చేవారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయనివ్వమని చంద్రబాబు ఎక్కడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును అసలు బ్రష్టు పట్టించింది చంద్రబాబు కాదా…? అని నిలదీశారు. రాష్ట్రంలో జగనన్న ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ఎంపీ, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!