MP Laxman: రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు..
- బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు
- రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలవనున్న బీజేపీ నేతలు
- మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తోందని ఎంపీ ఆరోపణలు
- మూసీ ప్రక్షాళన పేరుతో పాదయాత్రలు కాదు
- రైతుల దగ్గరకు వెళ్లాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నామన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుందని మండిపడ్డారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనే వారు లేరని.. కలెక్టర్, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని వారు సమాధానమిచ్చినట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళన పేరుతో పాదయాత్రలు కాదు.. రైతుల దగ్గరకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మీ పాలన ఎలా సాగుతుందో రైతుల దగ్గరకు వెళ్తే అర్థం అవుతుందన్నారు. దున్నపోతు నిద్రల వ్యవహరిస్తున్న మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం ఏం అవ్వాలి. రైతులు ఎటు పోవాలి? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదారంగా కేంద్రం రైతులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రైతుల పొట్ట కొడుతుందని.. రేవంత్ ప్రభుత్వంలో క్వింటాల్ వడ్లపైన వెయ్యి రూపాయల నష్టానికి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రమే డబ్బులు ఇస్తు్న్నా.. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు.
READ MORE: Former CM Nadendla Bhaskara Rao: కుల గణనకు నేను వ్యతిరేకం కాదు.. కానీ ఓ అనుమానం!
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
సన్నాలకు బోనస్ అన్నారు.. ఇప్పటికీ లేదని.. రైతు భరోసా.. కౌలు.. కూలి రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికీ అమలు కాలేదని మండిపడ్డారు. రైతు భరోసా కాదు కదా.. ఇచ్చిన హామీలన్నీ బంద్ చేశారన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నారు.. ఇప్పుడు సన్నాలకు మాత్రమే బోనస్ అంటూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. 2014 లో యూపీఏ హయాంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని. నరేంద్రమోడీ ప్రభుత్వం 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. 27 కోట్లను ధాన్యం కొనుగోలుకు కేటాయించారని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన పైసలను రేవంత్ ఎందుకు ఖర్చు చేయడం లేదని అడిగారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదన్న నానుడిని గుర్తుచేశారు. తాము రాజకీయం కోసం కాదు.. రైతుల కోసం పర్యటనలు చేస్తున్నామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం విడవమని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!