Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mp Laxman Said That Bjp Is Conducting State Wide Tours For Farmers

MP Laxman: రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు..

Published Date :November 11, 2024 , 12:58 pm
By RAMAKRISHNA KENCHE
  • బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు
  • రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలవనున్న బీజేపీ నేతలు
  • మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తోందని ఎంపీ ఆరోపణలు
  • మూసీ ప్రక్షాళన పేరుతో పాదయాత్రలు కాదు
  • రైతుల దగ్గరకు వెళ్లాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్
MP Laxman: రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నామన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుందని మండిపడ్డారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనే వారు లేరని.. కలెక్టర్, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని వారు సమాధానమిచ్చినట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళన పేరుతో పాదయాత్రలు కాదు.. రైతుల దగ్గరకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మీ పాలన ఎలా సాగుతుందో రైతుల దగ్గరకు వెళ్తే అర్థం అవుతుందన్నారు. దున్నపోతు నిద్రల వ్యవహరిస్తున్న మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం ఏం అవ్వాలి. రైతులు ఎటు పోవాలి? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదారంగా కేంద్రం రైతులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రైతుల పొట్ట కొడుతుందని.. రేవంత్ ప్రభుత్వంలో క్వింటాల్ వడ్లపైన వెయ్యి రూపాయల నష్టానికి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రమే డబ్బులు ఇస్తు్న్నా.. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు.

READ MORE: Former CM Nadendla Bhaskara Rao: కుల గణనకు నేను వ్యతిరేకం కాదు.. కానీ ఓ అనుమానం!

Also Read

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?

సన్నాలకు బోనస్ అన్నారు.. ఇప్పటికీ లేదని.. రైతు భరోసా.. కౌలు.. కూలి రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికీ అమలు కాలేదని మండిపడ్డారు. రైతు భరోసా కాదు కదా.. ఇచ్చిన హామీలన్నీ బంద్ చేశారన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నారు.. ఇప్పుడు సన్నాలకు మాత్రమే బోనస్ అంటూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. 2014 లో యూపీఏ హయాంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని. నరేంద్రమోడీ ప్రభుత్వం 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. 27 కోట్లను ధాన్యం కొనుగోలుకు కేటాయించారని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన పైసలను రేవంత్ ఎందుకు ఖర్చు చేయడం లేదని అడిగారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదన్న నానుడిని గుర్తుచేశారు. తాము రాజకీయం కోసం కాదు.. రైతుల కోసం పర్యటనలు చేస్తున్నామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం విడవమని స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • conducting state-wide tours
  • Farmers
  • farmers are being met
  • government

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions