MP K.Laxman : ఒక కలం పోటుతో కేసీఆర్ సర్కార్ వారికి అన్యాయం చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26 కులాల జేఏసీ నేతలు గవర్నర్ ను కలిశారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏపీ నుండి వచ్చి ఈ 26 కులాల వాళ్ళ ఏళ్ల తరబడి ఇక్కడ ఉంటున్నారని, చిన్న చిన్న పనులు చేసుకుని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ జాబితాలో ఉన్న వారిని రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక కలం పోటుతో కేసీఆర్ సర్కార్ వారిని బీసీ జాబితా నుండి తొలగించిందన్నారు. ఈ 26 కులాలు ఇక్కడ రిజర్వేషన్ సౌకర్యాలు పొందలేక పోతున్నారని, వారికి ఆంధ్రములాలు ఉన్నాయనే బీసీ జాబితా నుండి తొలగించారని ఆయన అన్నారు. ఓట్లు వచ్చినప్పుడు కాలుకు ముళ్ళు కుచ్చుకుంటే నోటితో తీస్తానని చెప్పిన సీఎం ఇపుడు వారిని ఒక కలం పోటుతో కడుపులో పొడిచారంటూ ఆయన విమర్శించారు.
Also Read :Mahesh Babu: తండ్రిని మర్చిపోలేని మహేష్.. కన్నీటి లేఖ
Also Read
- JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
- WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
- Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
- Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్దీప్-సమ్రీన్ రిలేషన్పై మళ్లీ చర్చ..!
రెండు రాష్ట్రాలు బీసీలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని, వాళ్ళ హక్కుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ లు తగ్గించాయని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందిస్తూ.. ఐటీ దాడులు కొత్త కాదని, తప్పు చేయని వాళ్ళు జడుసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Also Read : Pakistan: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్
తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నట్లు.. సక్రమంగా ఎవరు కట్టకపోయినా ఇబ్బందులు తప్పవు. దీన్ని రాజకీయానికి ముడి పెట్టి డైవర్ట్ చేయడం సరికాదు. అధికారులు వారి పని వారు చేసుకుంటారు. రాజకీయంగా బీజేపీ ని ఎదుర్కోలేక కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే బీఎల్ సంతోష్ పేరును పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. దేశసేవ చేసే వ్యక్తిపై లేని పోని అభాండాలు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురి పేర్లను పెట్టుకుని కావాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. మేము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’కి నాలుగేళ్లు.. ఇంకా చెక్కుతూనే ఉన్న జక్కన్న
-
Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
-
Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!