MP K.Laxman : ఓట్లు వేసి గెలిపించాక ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారు
- ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీ పేరుతో మోసపూరిత హామీలు చెపుతోంది
- ఎన్నో కారణాలు చెప్పి మొండి చెయ్యి చూపిస్తున్నారు
- తెలంగాణలో గ్యారంటీలు అమలు చేయక.. హైడ్రా పేరుతో హడావిడి చేస్తున్నారు
- కర్నాటక లో దగా పడ్డారు.. తెలంగాణలో అదే పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ హామీలపై ఆందోళనను వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీ పేరుతో మోసపూరిత హామీలు చెపుతోందని, “గ్యారంటీ” అనే పేరుతో ప్రజలను మోసపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మోసపూరిత హామీలతో ఓట్లు వేసుకుని గెలిచాక, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అనేక కారణాలు చెప్పి, నిర్లక్ష్యంగా చుక్కలు చూపిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఈ గ్యారంటీలను అమలు చేయడం కాకుండా, “హైడ్రా” అనే పేరుతో ఇతర అంశాలకు దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజలు దగాపడినట్లు ఆయన పేర్కొంటూ, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. కాంగ్రెస్ కొత్త కొత్త డ్రామాలను తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే అవినీతికి, కుటుంబ రాజకీయాలకు, విచ్ఛిన్న శక్తులకు ఊతమిస్తారని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఓట్ల కోసం హామీలు ఇచ్చి, అమలు చేయక పోవడం మాత్రం కాంగ్రెస్ ఫ్లాప్ షో అని ఆయన వ్యాఖ్యానించారు.
MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
వరంగల్ లో సమావేశం పెట్టి హామీలు అమలు చేస్తామన్నారని, కానీ ఇంకా ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి విషమంగా మారుతోంది అని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి దృష్టి భ్రష్టం చేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న కూల్చివేతలపై డాక్టర్ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. పేద ప్రజల ఇళ్ళను ఎందుకు కూలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అనేక చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, పేద ప్రజల ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తిరుమల దేవస్థానం నియమాల ప్రకారం, ఇతర మతాల వ్యక్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. జగన్ పట్ల హిందువుల ఆత్మీయత లేకపోవడంపై ఆయన మండిపడుతున్నారు. ప్రతి వ్యక్తి తన విశ్వాసాలను పాటించాల్సిన అవసరం ఉందని, కానీ ఇతరుల విశ్వాసాలను గౌరవించాలి అని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తిరుమల పవిత్రమైన స్థలంగా కొనసాగాల్సిన అవసరం ఉందని, పవిత్రతను కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!