Siddaramaiah: రాజకీయ కుట్రలకు నా సతీమణి బాధితురాలు..
- 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య భార్య..
- రాజకీయ విద్వేషాలు.. కుట్రలకు తన భార్య పార్వతి బాధితురాలైంది..
- నాపై జరుగుతున్న రాజకీయ కుట్రలు చూసి నా భార్య ఆవేదన చెందింది: సిద్ధరామయ్య
Siddaramaiah: ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి ఈరోజు (సోమవారం) ఓ లేఖను రిలీజ్ చేసింది. అందులో అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ఈ 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
Read Also: Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్
Also Read
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
కాగా, రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారని సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. ముడా స్థలాల కేటాయింపులో భాగంగా మాకు వచ్చిన భూములను నా భార్య తిరిగిచ్చేసింది అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు కంప్లైంట్స్ చేసి నా కుటుంబాన్ని వివాదంలోకి లాగారని మండిపడ్డారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే నా సిద్ధాంతం అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
Read Also: MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
ఇక, నాపై జరుగుతున్న ఈ రాజకీయ కుట్రలు చూసి నా భార్య పార్వతి ఆవేదన చెందిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. అందుకే, ఈ భూములను తిరిగి ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకుంది.. ఇది తనకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అన్నారు. నాలుగు దశాబ్దాల నా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు.. కుటుంబ బాధ్యతలకే నా భార్య పరిమితమైంది.. ఇప్పుడు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు గురై తాను మానసిక క్షోభను అనుభవిస్తోందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
తాజావార్తలు
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!