Siddaramaiah: రాజకీయ కుట్రలకు నా సతీమణి బాధితురాలు..
- 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య భార్య..
- రాజకీయ విద్వేషాలు.. కుట్రలకు తన భార్య పార్వతి బాధితురాలైంది..
- నాపై జరుగుతున్న రాజకీయ కుట్రలు చూసి నా భార్య ఆవేదన చెందింది: సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి ఈరోజు (సోమవారం) ఓ లేఖను రిలీజ్ చేసింది. అందులో అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ఈ 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
Read Also: Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
కాగా, రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారని సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. ముడా స్థలాల కేటాయింపులో భాగంగా మాకు వచ్చిన భూములను నా భార్య తిరిగిచ్చేసింది అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు కంప్లైంట్స్ చేసి నా కుటుంబాన్ని వివాదంలోకి లాగారని మండిపడ్డారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే నా సిద్ధాంతం అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
Read Also: MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
ఇక, నాపై జరుగుతున్న ఈ రాజకీయ కుట్రలు చూసి నా భార్య పార్వతి ఆవేదన చెందిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. అందుకే, ఈ భూములను తిరిగి ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకుంది.. ఇది తనకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అన్నారు. నాలుగు దశాబ్దాల నా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు.. కుటుంబ బాధ్యతలకే నా భార్య పరిమితమైంది.. ఇప్పుడు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు గురై తాను మానసిక క్షోభను అనుభవిస్తోందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
తాజావార్తలు
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!