Siddaramaiah: రాజకీయ కుట్రలకు నా సతీమణి బాధితురాలు..
- 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య భార్య..
- రాజకీయ విద్వేషాలు.. కుట్రలకు తన భార్య పార్వతి బాధితురాలైంది..
- నాపై జరుగుతున్న రాజకీయ కుట్రలు చూసి నా భార్య ఆవేదన చెందింది: సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి ఈరోజు (సోమవారం) ఓ లేఖను రిలీజ్ చేసింది. అందులో అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ఈ 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
Read Also: Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
కాగా, రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారని సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. ముడా స్థలాల కేటాయింపులో భాగంగా మాకు వచ్చిన భూములను నా భార్య తిరిగిచ్చేసింది అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు కంప్లైంట్స్ చేసి నా కుటుంబాన్ని వివాదంలోకి లాగారని మండిపడ్డారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే నా సిద్ధాంతం అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
Read Also: MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
ఇక, నాపై జరుగుతున్న ఈ రాజకీయ కుట్రలు చూసి నా భార్య పార్వతి ఆవేదన చెందిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. అందుకే, ఈ భూములను తిరిగి ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకుంది.. ఇది తనకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అన్నారు. నాలుగు దశాబ్దాల నా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు.. కుటుంబ బాధ్యతలకే నా భార్య పరిమితమైంది.. ఇప్పుడు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు గురై తాను మానసిక క్షోభను అనుభవిస్తోందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?