MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
- ముడా స్కామ్లో నేపథ్యంలో కర్ణాటక సీఎం భార్య పార్వతి సంచలన నిర్ణయం..
- తమకు కేటాయించిన 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు వెల్లడి..
- రాజకీయాలకు దూరంగా ఉండే నాలాంటి వారిని వివాదాల్లోకి లాగొద్దు: కర్ణాటక సీఎం భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు (సోమవారం) ఓ లేఖను రిలీజ్ చేసింది. అందులో అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ఈ 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Komatireddy Venkat Reddy: మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తాం..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
అలాగే, మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు ఇంత రాద్దాంతం చేస్తాయని తాను ఊహించలేదు కన్నడ సీఎం సతీమణి పార్వతి తెలిపింది. నా భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి ఏం కాదని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు ఆయన అధికారం నుంచి తాము ఏమీ ఆశించలేదు.. మాకు ఈ ఆస్తులు తృణప్రాయం. అందుకే ఈ స్థలాలను తిరిగి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు (ముడా) అప్పగిస్తున్నాను అని ప్రకటించింది. ఈ విషయంలో నా భర్త అభిప్రాయం ఏంటో నాకు తెలియదు.. నా కుటుంబ సభ్యులతోనూ చర్చించకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం ఇది అన్నారు.
Read Also: Adani Group: అదానీ, కెన్యా మధ్య ‘రహస్య’ ఒప్పందం.. బహిర్గతం చేసిన వ్యక్తికి ప్రాణహాని!
ఇక, ఈ ఆరోపణలు వచ్చిన రోజే ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నాను.. కానీ, నా భర్త రాజకీయ కుట్రలో మరింత నష్టపోతున్నాడని తెలిసి ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నాను అని సిద్ధరామయ్య భార్య పార్వాతి పేర్కొనింది. అవసరమైతే దర్యాప్తునకు కూడా సహకరిస్తాను.. రాజకీయ రంగానికి దూరంగా ఉండే నాలాంటి ఆడవాళ్లను వివాదాల్లోకి లాగొద్దని ఆమె ఆ లేఖలో ప్రస్తావించింది. మరోవైపు, ఈ పరిణామాలపై ముడా కమిషనర్ రియాక్ట్ అయ్యారు. ముడా ఆస్తులను ఎవరైనా వెనక్కి ఇచ్చేస్తే తాము తీసుకుంటాం.. దీనిపై అందరితో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!