Daggubati Purandeswari: అంబేద్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ: పురందేశ్వరి
- అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
- ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్
- అంబేద్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డా.బీఆర్ అంబేడ్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. రాజ్యాంగం, అంబేడ్కర్ను బీజేపీ ఎన్నడూ అగౌరపరచదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేడ్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్.. ఎందుకు భారత రత్న ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. వాజ్పేయీ హయాంలో అంబేడ్కర్కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీది అని పురందరేశ్వరి పేర్కొన్నారు. అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పురందేశ్వరి స్పందించారు.
రాజమండ్రిలో ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… ‘బాబా సాహెబ్ అంబేడ్కర్ను అమితంగా గౌరవించిన పార్టీ బీజేపీ. ఎన్నికల సమయంలో బీజేపీ రాజ్యాంగంను ఎత్తివేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. పార్లమెంట్లో అమెండిమెంట్ (సవరణలు) ద్వారా రాజ్యాంగం మార్చడం వీలవుతుంది. బీజేపీ అధికారంలో ఉన్నకాలంలో ఎప్పుడు రాజ్యాంగం స్వలాభం కోసం మార్చలేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమెండిమెంట్స్ చేసాము. కాంగ్రెస్ పార్టీ ఉపయోగపరంగా రాజ్యాంగాన్ని మార్చింది. అంబేడ్కర్కు భారత్ రత్న ఇవ్వాలని కాంగ్రెస్కి తట్టలేదు. బీజేపీ ప్రభుత్వంలోనే అంబేడ్కర్కు భారత్ రత్న ప్రకటించాము. అంబేడ్కర్ను రెండుసార్లు కాంగ్రెస్ అమానించింది. గతంలో అంబేడ్కర్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవనివ్వలేదు. కాంగ్రెస్ చర్యలతో అంబేద్కర్ మానసికంగా కుంగిపోయారు’ అని అన్నారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
‘హిందూ బిల్, యూనిఫాం సివిల్ కోర్టు బిల్ ప్రవేశపెట్టాం. రాహుల్ గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి మాల వెయ్యలేదు. ప్రజా సమస్యలు చర్చించే దేవాలయంలో కాంగ్రెస్ అడ్డుకుంటుంది. బీజేపీ ఎన్నడూ రాజ్యాంగాన్ని ఉల్లంగించలేదు, మార్చాలన్న భావన లేదు. గతంలో ఆర్టికల్ 356ని రద్దును తీవ్రంగా వ్యతిరేకించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వం రద్దు చేసే చట్టం ఆర్టికల్ 356. జమీలి ఎన్నికల బిల్లు లోక్ సభలో చర్చించడం జరిగింది. జేపీసీ వెయ్యడం జరిగింది. విధివిధానాలు రూపొందించి బిల్లు ప్రవేశ బెట్టడం జరుగుతుంది’ అని ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..