Daggubati Purandeswari: అంబేద్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ: పురందేశ్వరి
- అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
- ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్
- అంబేద్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డా.బీఆర్ అంబేడ్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. రాజ్యాంగం, అంబేడ్కర్ను బీజేపీ ఎన్నడూ అగౌరపరచదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేడ్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్.. ఎందుకు భారత రత్న ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. వాజ్పేయీ హయాంలో అంబేడ్కర్కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీది అని పురందరేశ్వరి పేర్కొన్నారు. అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పురందేశ్వరి స్పందించారు.
రాజమండ్రిలో ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… ‘బాబా సాహెబ్ అంబేడ్కర్ను అమితంగా గౌరవించిన పార్టీ బీజేపీ. ఎన్నికల సమయంలో బీజేపీ రాజ్యాంగంను ఎత్తివేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. పార్లమెంట్లో అమెండిమెంట్ (సవరణలు) ద్వారా రాజ్యాంగం మార్చడం వీలవుతుంది. బీజేపీ అధికారంలో ఉన్నకాలంలో ఎప్పుడు రాజ్యాంగం స్వలాభం కోసం మార్చలేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమెండిమెంట్స్ చేసాము. కాంగ్రెస్ పార్టీ ఉపయోగపరంగా రాజ్యాంగాన్ని మార్చింది. అంబేడ్కర్కు భారత్ రత్న ఇవ్వాలని కాంగ్రెస్కి తట్టలేదు. బీజేపీ ప్రభుత్వంలోనే అంబేడ్కర్కు భారత్ రత్న ప్రకటించాము. అంబేడ్కర్ను రెండుసార్లు కాంగ్రెస్ అమానించింది. గతంలో అంబేడ్కర్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవనివ్వలేదు. కాంగ్రెస్ చర్యలతో అంబేద్కర్ మానసికంగా కుంగిపోయారు’ అని అన్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
‘హిందూ బిల్, యూనిఫాం సివిల్ కోర్టు బిల్ ప్రవేశపెట్టాం. రాహుల్ గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి మాల వెయ్యలేదు. ప్రజా సమస్యలు చర్చించే దేవాలయంలో కాంగ్రెస్ అడ్డుకుంటుంది. బీజేపీ ఎన్నడూ రాజ్యాంగాన్ని ఉల్లంగించలేదు, మార్చాలన్న భావన లేదు. గతంలో ఆర్టికల్ 356ని రద్దును తీవ్రంగా వ్యతిరేకించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వం రద్దు చేసే చట్టం ఆర్టికల్ 356. జమీలి ఎన్నికల బిల్లు లోక్ సభలో చర్చించడం జరిగింది. జేపీసీ వెయ్యడం జరిగింది. విధివిధానాలు రూపొందించి బిల్లు ప్రవేశ బెట్టడం జరుగుతుంది’ అని ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?