Daggubati Purandeswari: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను గౌరవించింది బీజేపీ మాత్రమే!
- అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై కార్యాచరణ
- ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు పురంధేశ్వరి, డీకే అరుణ
- అంబేద్కర్ స్ఫూర్తి తెలిపేలా చేయడం మా ధ్యేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను గౌరవించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్లో ఆయన చిత్రపటం పెట్టాం అని, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని చేసినవే అని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై రాష్ట్రస్ధాయి కార్యాచరణ సమావేశానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు.
ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమసమాజ స్ధాపనకు కృషి చేశారు. 2014 ఎన్నికల్లో విపక్షాలు మా పట్ల దుష్ప్రచారం చేశాయి. అంబేడ్కర్ను గౌరవించింది బీజేపీ మాత్రమే. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్లో ఆయన చిత్రపటం పెట్టాం. 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయి. నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని చేసినవే. డీకే శివకుమార్ ముస్లిం మైనారిటీలకు 4% అదనపు రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగాన్ని మార్చేస్తాం అన్నారు. శివకుమార్కు రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం ఇదేనా.. మీకోసం మార్చేస్తారా?’ అని మండిపడ్డారు.
Also Read
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
‘అంబేద్కర్ జయంతి వేడుకలు రేపటి నుంచి 25వ తేదీ వరకూ జరపాలని నిర్ణయం తీసుకున్నాం. అంబేద్కర్ ఆశయాలను గ్రామగ్రామాలకూ తీసుకెళ్ళాలని నిర్ణయించారు. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే కాంగ్రెస్ దుష్ప్రచారం వల్ల వచ్చిన అనుమానాలు లేకుండా చేయడానికే ఈ వేడుకలు. అంబేద్కర్ను ఓడించాలని నెహ్రూ అప్పట్లో ఆదేశించారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. మోడీ దేశ అభువృద్ధి కోసం రాజ్యాంగ సవరణలు చేశారు. పార్టీ అధికారం కోసం ఏనాడూ బీజేపీ రాజ్యాంగ సవరణలు చేయలేదు. మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి ధ్యేయంగా అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నది బీజేపీ. ఎన్డీఏ ప్రభుత్వ కృషిని గురించి ప్రజలకు తెలిసేలా చేయడం, అంబేద్కర్ స్ఫూర్తి తెలిపేలా చేయడం మా ధ్యేయం’ అని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
ట్రెండింగ్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!