Daggubati Purandeswari: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను గౌరవించింది బీజేపీ మాత్రమే!
- అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై కార్యాచరణ
- ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు పురంధేశ్వరి, డీకే అరుణ
- అంబేద్కర్ స్ఫూర్తి తెలిపేలా చేయడం మా ధ్యేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను గౌరవించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్లో ఆయన చిత్రపటం పెట్టాం అని, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని చేసినవే అని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై రాష్ట్రస్ధాయి కార్యాచరణ సమావేశానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు.
ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమసమాజ స్ధాపనకు కృషి చేశారు. 2014 ఎన్నికల్లో విపక్షాలు మా పట్ల దుష్ప్రచారం చేశాయి. అంబేడ్కర్ను గౌరవించింది బీజేపీ మాత్రమే. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్లో ఆయన చిత్రపటం పెట్టాం. 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయి. నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని చేసినవే. డీకే శివకుమార్ ముస్లిం మైనారిటీలకు 4% అదనపు రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగాన్ని మార్చేస్తాం అన్నారు. శివకుమార్కు రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం ఇదేనా.. మీకోసం మార్చేస్తారా?’ అని మండిపడ్డారు.
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
‘అంబేద్కర్ జయంతి వేడుకలు రేపటి నుంచి 25వ తేదీ వరకూ జరపాలని నిర్ణయం తీసుకున్నాం. అంబేద్కర్ ఆశయాలను గ్రామగ్రామాలకూ తీసుకెళ్ళాలని నిర్ణయించారు. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే కాంగ్రెస్ దుష్ప్రచారం వల్ల వచ్చిన అనుమానాలు లేకుండా చేయడానికే ఈ వేడుకలు. అంబేద్కర్ను ఓడించాలని నెహ్రూ అప్పట్లో ఆదేశించారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. మోడీ దేశ అభువృద్ధి కోసం రాజ్యాంగ సవరణలు చేశారు. పార్టీ అధికారం కోసం ఏనాడూ బీజేపీ రాజ్యాంగ సవరణలు చేయలేదు. మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి ధ్యేయంగా అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నది బీజేపీ. ఎన్డీఏ ప్రభుత్వ కృషిని గురించి ప్రజలకు తెలిసేలా చేయడం, అంబేద్కర్ స్ఫూర్తి తెలిపేలా చేయడం మా ధ్యేయం’ అని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!