MP Balram Naik: కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Balram Naik: ములుగు జిల్లాలో జరిగిన ఇంద్ర మహిళ పట్టాల పంపిణీ కార్యక్రమం సభ రాజకీయ వ్యాఖ్యలతో హాట్ టాపిక్గా మారింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ములుగు ఎంపీ బలరాం నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని నా పరిధిలో ఉన్న రెండు మండలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీతక్కదే అని స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు ప్రస్తుతం మార్కెట్ ధర రూ.60 ఉన్న సన్నబియ్యం ఉచితంగా అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ సామాజిక సంకల్పానికి నిదర్శనమని అన్నారు.
Read Also: KCR Enquiry: ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ.. BRK భవన్ వద్ద పెద్దెత్తున ఆందోళనలు..!
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
అయితే, ఈ సభలో ఎంపీ బలరాం నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గిరిజన యూనివర్సిటీకి ప్రహరీ గోడ నిర్మాణం కోసం నిధులు వస్తున్నాయి. మొత్తం 800 కోట్ల నిధులు తీసుకువస్తున్నాం అని అన్నారు. మారుమూల గ్రామాలకు బ్రిడ్జిలు నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన హరితహారం పథకంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హరితహారం పేరుతో హరీష్ రావు 35 వేల కోట్ల రూపాయలు తినేశారు. నేను దీనిని నిరూపించగలను, హరీష్ రావు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. పైసలు తిన్నందువల్లే కేసుల్లో తిరుగుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: KTR: కాళేశ్వరంను చిల్లర రాజకీయాలకోసం వాడుతున్నారు.. కేటీఆర్ బోల్డ్ కామెంట్స్..!
అకాగే తెలంగాణ ఏర్పాటుపై కూడా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడితో తెలంగాణ రాలేదు. సోనియా గాంధీ ఇచ్చారు. మేమందరం హౌస్ లో కొట్లాడితే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో మరో 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ను నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!