KCR Enquiry: ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ.. BRK భవన్ వద్ద పెద్దెత్తున ఆందోళనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Enquiry: తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నింపే పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక మలుపు తిరిగింది. నేటి ఉదయం హైదరాబాద్లోని BRK భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఓపెన్ కోర్ట్లో విచారించాలని కమీషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయనను మినహాయించి అందరిని అక్కడి నుండి బయటకు పంపించిన అనంతరం వన్ టు వన్ విచారణకు సిద్ధమయ్యారు. కోర్టు హాల్ నుండి ఇతరులందరినీ బయటకు పంపిన ఘటన తీవ్ర ఉత్కంఠను రేపింది.
Read Also: KTR: కాళేశ్వరంను చిల్లర రాజకీయాలకోసం వాడుతున్నారు.. కేటీఆర్ బోల్డ్ కామెంట్స్..!
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఈ క్రమంలో కేసీఆర్ ఓపెన్ కోర్టులో స్వయంగా హాజరయ్యారు. జస్టిస్ ఘోష్ ఆయనను ప్రత్యక్షంగా ప్రశ్నించడమే కాకుండా, అన్ని విషయాల్లో వాస్తవాలను తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా విచారణ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో BRK భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తమ నేత కేసీఆర్కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
Read Also: Gold Prices: బంగారు ప్రియలకి ఝలక్.. భారీగా పెరిగిన పుత్తడి ధర..!
కొందరు కార్యకర్తలు బారికేడ్లు దాటి ముందుకు రావడంతో పోలీసులతో తోపులాట జరిగింది. పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు మరింత ఉగ్రంగా నినాదాలు చేస్తూ కేసీఆర్కు సంఘీభావం తెలియజేశారు. ఇప్పటికే కేసీఆర్ను విచారించడంపై రాజకీయ వర్గాల్లో పెద్దెత్తున చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణను కక్ష సాధింపు చర్యగా ఉపయోగించుకుంటుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు అధికార పక్షం మాత్రం న్యాయపరంగా ఇది అవసరమైన చర్యేనని స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!