Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Months Ahead Of Polls Madhya Pradesh May See Cabinet Expansion

MP Cabinet Expansion: ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌!

Published Date :August 24, 2023 , 7:52 pm
By Mahesh Jakki
MP Cabinet Expansion: ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

MP Cabinet Expansion: అక్టోబర్ రెండో వారంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు బీజేపీ రాజకీయ సమీకరణాలపై కసరత్తు ప్రారంభించింది. అసంతృప్తులను శాంతింపజేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ, కుల సమీకరణాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని విస్తరించబోతోంది. దీనికి సంబంధించి అధికార పార్టీలో మథనం సాగుతోంది. ఈ మేరకు బుధవారం రాత్రి కూడా సీఎం కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. 2020 మార్చిలో ప్రారంభమైన శివరాజ్ చౌహాన్ కేబినెట్‌లోకి ముగ్గురు నుంచి నలుగురు కొత్త సభ్యులు చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: Encounters: బాలికలను రక్షించేందుకు ఎన్‌కౌంటర్లు అవసరం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

నిజానికి, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సంబంధించి ఎంపీ కేబినెట్‌లో 35 మంది ఉండవచ్చు. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మినహా 30 మంది మంత్రులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు ఇదే మొదటి కారణం కావచ్చు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్‌ పెరుగుతుందనే చర్చ చాలా కాలంగా సాగుతోంది .2020లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం జ్యోతిరాదిత్య సింధియా మద్దతుతో ఏర్పాటైంది. సింధియాతో కలిసి పార్టీలోకి చేరిన వారికి న్యాయం చేసే క్రమంలో మంత్రివర్గంలో ప్రాంతీయ, కులాల సమతూకం చెడిపోయింది. ఫలితంగా అనేక ప్రాంతాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. ఇదే సమయంలో పార్టీలో అసంతృప్తి పెరిగిపోయింది. ప్రస్తుతం పార్టీ అసంతృప్తిని నిర్వహించడంలో అధిష్ఠానం నిమగ్నమై ఉంది.

కాగా, మధ్యప్రదేశ్‌లో వింధ్య, బుందేల్‌ఖండ్‌లతో కలిపి మొత్తం 56 సీట్లు ఉన్నాయి. ఇదిలావుండగా శివరాజ్ మంత్రివర్గంలో ఇరు ప్రాంతాల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. శివరాజ్ కేబినెట్‌లో వింధ్య నుంచి ముగ్గురు, బుందేల్‌ఖండ్‌ నుంచి నలుగురు మంత్రులుగా ఉన్నారు. బుందేల్‌ఖండ్‌లో ముగ్గురు ఒకే జిల్లాకు చెందినవారు. అక్కడ మహాకౌశల్ నుంచి ఒక్కరే మంత్రి. బీజేపీ దాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. రాష్ట్రంలో అధికార వ్యతిరేకతను ఓడించేందుకు, కుల సమీకరణలను సమతుల్యం చేసేందుకు, ప్రాంతీయ ఆకాంక్షలను పరిష్కరించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సిఫారసు మేరకు ఈ విస్తరణ జరుగుతోందని, ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరగనున్నాయని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి.

Read Also: Dalai Lama: చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై ప్రధాని మోడీ, ఇస్రోను అభినందించిన దలైలామా

అదే సమయంలో వింధ్య నుంచి మాజీ మంత్రి, బలమైన నేత రాజేంద్ర శుక్లా పేరు చర్చనీయాంశమైంది. దీనితో పాటు, మహాకౌశల్ నుంచి గౌరీశంకర్ బిసెన్ పేరు చర్చనీయాంశమైంది. దీంతో పాటు బుందేల్‌ఖండ్ నుంచి రాహుల్ లోధీ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరి పేర్లపై ఏకాభిప్రాయం కుదిరిందని, మరో ఇద్దరి కోసం చర్చ జరుగుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రాజేంద్ర శుక్లాను మంత్రిని చేయడం ద్వారా పార్టీ బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించడంలో బిజీగా ఉంది. అదే సమయంలో గౌరీశంకర్ బిసెన్‌కు మంత్రి పదవి కలిపించి ఓబీసీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు జరుగుతోంది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అసంతృప్తితో బీజేపీ కొన్ని స్థానాల్లో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎన్నికల తేదీల ప్రక‌ట‌న‌కు ముందే అసంతృప్తులను చల్లార్చే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ కూడా ఈ ఎపిసోడ్‌లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • cabinet expansion
  • Madhya Pradesh
  • MP Cabinet Expansion
  • MP Polls

తాజావార్తలు

  • Sonia Gandhi: అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలింపు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions