Encounters: బాలికలను రక్షించేందుకు ఎన్కౌంటర్లు అవసరం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP leader says Encounters needed to save girls in Bengal: మహిళల భద్రతపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రత కోసం అవసరమైతే పోలీసులు ఎన్కౌంటర్లను ఆశ్రయించాలని సువేందు అధికారి బుధవారం అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి మాత్రమే పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలను నియంత్రించగలడని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు.
Read Also: Dalai Lama: చంద్రయాన్-3 ల్యాండింగ్పై ప్రధాని మోడీ, ఇస్రోను అభినందించిన దలైలామా
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాలేజీ దాటని ఆడ పిల్లలు అఘాయిత్యాలకు గురవుతున్నారని, పశ్చిమ బెంగాల్ హంతకులకు నిలయంగా మారిందని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక్కరే పరిస్థితిని అదుపు చేయగలరని సువేందు అధికారి అన్నారు. “అవసరమైతే ఈ నేరస్థులను ఎన్కౌంటర్ చేయాలి. ఈ నేరస్థులకు మనుషులతో జీవించే హక్కు లేదు,” అన్నారాయన.
సువేందు అధికారి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే తపస్ రాయ్ స్పందిస్తూ.. “బెంగాల్ను యోగి రాజ్గా మార్చాలని సువేందు ఎంత కోరుకున్నా అది ఎప్పటికీ జరగదు. అత్యాచార కేసుల బాధితులకు చట్టం ద్వారా సత్వర విచారణ, న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అత్యాచార నేరస్థులను కూడా చట్ట ప్రకారమే మేము కఠినంగా శిక్షించాలనుకుంటున్నాము” అని అన్నారు. ఎన్కౌంటర్ల గురించి సువేందు మాట్లాడుతున్నారని.. పశ్చిమ బెంగాల్లోని ప్రజలు దీనిని సమర్థించరన్నారు. బెంగాల్లో తాలిబన్ పాలన ఉండాలని ఆయన కోరుకుంటున్నారా తపస్ రాయ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!