Currency Notes Withdraw : నోట్ల రద్దు ఎప్పుడేప్పుడు జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. అయితే రూ.2000 నోటును ప్రవేశపెట్టిన తొలి ప్రధాని కూడా ఆయనే అవుతారు. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 100 రూపాయలకు మించిన కరెన్సీని నిషేధించారు. ఆయన రెండు సందర్భాల్లో, నల్లధనం యొక్క ముప్పు ఉండటంతో పెద్ద నోట్లను రద్దు చేయవలసిందిగా ఆర్బీఐ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. ఇక 2016 నవంబర్ నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని మోడీ ప్రకటించారు. వాటికి బదులుగా వాటి స్థానంలో రూ.500, 2000 కొత్త నోట్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు.
Also Read : Rs 2,000 Note Withdrawn: రూ.2000 నోటు @ 7 ఏళ్లు.. ఎందుకు రద్దు అంటే..?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
తొలి సారి 1978 జనవరి 17న మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రూ. 1,000, రూ. 5,000 మరియు రూ. 10,000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముద్రించిన అత్యధిక కరెన్సీ నోటు బ్రిటిష్ రాజ్ కాలంలో రూ. 10,000 నోటు. ఇది మొదట 1938లో ముద్రించబడింది మరియు 1954లో కొత్త వెర్షన్ వచ్చింది. RBI డేటా ప్రకారం, ఈ నోట్లను 1946 జనవరిలో మరియు మళ్లీ 1978 జనవరిలో రద్దు చేశారు. దేశాయ్ అధికారంలోకి రాగానే రూ.1000, రూ.5,000, రూ.10,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. కానీ ఆర్థిక శాఖను కూడా కలిగి ఉన్న ప్రధానమంత్రి జనవరి 1978లో ఈ నోట్లన్నింటినీ రద్దు చేశారు.
Also Read : 2000 Note Withdraw: 2 వేల నోటుని ఎలా మార్చుకోవాలి?
అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో రూ.1000 నోటు మళ్లీ వచ్చింది. నవంబర్ 2000లో, వ్యాపార లావాదేవీలకు సులువుగా ఉంటుందనే కారణంతో ఈ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టారు. అక్టోబర్ 1987లో రూ. 500 నోట్లు ఇప్పటికే తిరిగి చలామణిలోకి వచ్చాయి. ద్రవ్యోల్బణం కారణంగా చెలామణిలో ఉన్న నోట్ల పరిమాణాన్ని నియంత్రించే ప్రయత్నంగా ఈ చర్య సమర్థించబడింది. అశోక పిల్లర్ వాటర్మార్క్ సిరీస్లోని రూ.10 డినామినేషన్లో ఉన్న బ్యాంక్ నోట్లు 1967 మరియు 1992 మధ్య, రూ. 20.. 1972 మరియు 1975లో, రూ. 50 మరియు 1975 మరియు 1981లో మరియు రూ.100 1967-1979 మధ్య జారీ చేయబడ్డాయి. రూ.50 మరియు రూ.100 నోట్లను ఆగస్టు 2005లో విడుదల చేశారు, ఆ తర్వాత రూ.500 మరియు రూ.1,000 డినామినేషన్లను అక్టోబర్ 2005లో మరియు రూ.10 మరియు రూ.20 ఏప్రిల్ 2006 మరియు ఆగస్టు 2006లో విడుదల చేశారు.
Also Read : Meta Layoffs: మరో రౌండ్ ఉద్యోగుల తొలగింపుకు ఫేస్బుక్ కంపెనీ సిద్ధం.. వచ్చే వారమే ముహూర్తం..
ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో పాత నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో రూ.2వేల నోటును తీసుకువచ్చింది. అయితే వాటిని 2018 లోనే రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. అదే సమయం నుంచి గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్లు రెండు వేల నోట్లను సైతం రద్దు చేస్తారని పలుమార్లు ప్రచారం జరిగింది. ప్రజలు అనుకున్నట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంది. ఈ నోట్లు చెలామణిలో ఉండవని పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2వేల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. ఒకేసారి 20 వేల రూపాయల వరకు మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యులపై ఏ ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. కేవలం రూ.2 వేల నోట్లతో లావాదేవీలు జరిపే వారు, రియల్ ఎస్టేట్, పెద్ద వ్యాపారం నిర్వహించే వారికి ఈ నిర్ణయంతో కాస్త ఇబ్బంది ఉంటుందన్నారు.
Also Read : IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కొరతతో ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 24(1) ప్రకారం దేశంలో రూ.2000 నోట్లను 2016లో నవంబర్ లో ప్రవేశపెట్టారు. రెండేళ్ల అనంతరం ఈ పెద్ద నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. 2017 మార్చి నాటికి చలామణిలో ఉన్న నగదులో 2 వేల నోట్ల వాటా 89 శాతానికి చేరింది. 2018 మార్చి 31 నాటికి ఈ నోట్ల విలువ రూ.6.72 లక్షలుగా ఉంది. అయితే 2023 మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయింది.
Also Read : Bichhagadu 2: ఈ బిచ్చగాడు హిట్ కొట్టేశాడమ్మా..?
గతంలో 2013-14లో ఇదే తరహాలో చలామణిలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకున్నట్లు కీలక ప్రకటనలో ఆర్బీఐ గుర్తుచేసింది. బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసులలో రెండు వేల నోట్లను మార్చుకునే ప్రక్రియ మే 23న ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 30న ముగియనుందని ఆర్బీఐ తెలిపింది. మరిన్ని వివరాలకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ లో అప్ డేట్స్ చెక్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!