Rs 2,000 Note Withdrawn: రూ.2000 నోటు @ 7 ఏళ్లు.. ఎందుకు రద్దు అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs 2,000 Note Withdrawn: బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ పలు విషయాల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని సగటు భారతీయుడు భావిస్తున్న కాలం అది. సరిగ్గా అటువంటి సమయంలోనే నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిచారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. నల్లధనం అదుపు చేయడంతో పాటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆర్థిక నిధులు అందకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..
Also Read
- Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
- Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
ఆ సమయంలో కొత్తగా రూ. 500, రూ.2,000 నోటును తీసుకువచ్చింది కేంద్రప్రభుత్వం. తాజాగా ఈ రోజు రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపుగా ఏడేళ్ల పాటు రూ. 2000 నోటు మనుగడలో ఉంది. ఆర్బీఐ రూ.2,000 నోటును మార్చడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023ను ప్రకటించింది. నోట్ల రద్దు సమయంలో ఒత్తడిని తట్టుకోవడానికి ఆర్బీఐ రూ. 2000 లాంటి ఎక్కువ విలువ ఉన్న నోట్లను తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే కాలానుగుణంగా ఈ ఏడేళ్ల కాలంలో రూ.2000 నోటు క్రమక్రమంగా కనిపించడం తగ్గిపోయింది. ఆర్బీఐ చెబుతున్న లెక్కల ప్రకారం.. రూ.6.37 లక్షల కోట్లుగా ఉన్న రూ. 2000 నోట్ల విలువ 2018 మార్చి 31 నాటికి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గింది. 2023 మార్చి 31 నాటికి 10 శాతానికి చేరింది. దీంతో క్రమంగా నోట్లను వాడకం తగ్గిపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. 2018-19 నుంచే రూ. 2000 నోట్ల ముద్రణను ప్రభుత్వం ఆపేసింది. ప్రస్తుతం రూ.2వేల నోట్లు ఉన్నవారు ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
తాజావార్తలు
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!