NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA Majority: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లును ఆమోదించాలంటే లోక్సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఇటీవల మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలను మరింత పెంచుతున్నాయనే చర్చ సాగుతోంది.
గతంలో ఈ బిల్లుకు తగిన మద్దతు లభించకపోవడంతో అది ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాలు, శివసేనలో జరిగిన మార్పులు, అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం నుంచి వస్తున్న సంకేతాలు ఎన్డీఏకు అనుకూలంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై కొత్త చర్చకు దారితీశాయి.
Also Read
డీలిమిటేషన్ విషయంలో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా లోక్సభ సీట్లను 50 శాతం వరకు పెంచితే తమ పార్టీ సానుకూలంగా ఆలోచించే అవకాశముందని సుప్రియా సూలే వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీట్ల పెంపుపై చర్చించేందుకు సిద్ధమని పేర్కొనడం ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు వస్తోంది.
ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఎన్డీఏకు ఇప్పటికే ఉన్న బలానికి అదనంగా తిరుగుబాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, శివసేన నుంచి మారిన సభ్యులు, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీలు మద్దతు ఇస్తే సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో డీఎంకే వైఖరి అత్యంత కీలకంగా మారింది. డీఎంకేకు చెందిన ఎంపీలు మద్దతు ఇస్తే ప్రభుత్వం లక్ష్యానికి మరింత చేరువ అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ద్వారా 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాల పునర్విభజన, సీట్ల సంఖ్య పెంపు, అలాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించిన అంశాలు వేగవంతం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకే ఈ బిల్లుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై ఇంకా పూర్తి స్థాయిలో తమ వైఖరిని వెల్లడించలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశాలపై గతంలో వ్యక్తమైన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత డీలిమిటేషన్ బిల్లుపై ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎన్డీఏ మూడింట రెండు వంతుల మెజారిటీని సమీకరించగలదా? శరద్ పవార్ వర్గం, డీఎంకే వంటి పార్టీల తుది నిర్ణయం ఎలా ఉంటుంది? అనే అంశాలపై దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాల్లో జరిగే పరిణామాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!