Mocha Cyclone Alert: మోచా తుఫాన్.. మనం సేఫ్.. ఆ దేశాలకు డేంజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోచా తుఫాన్ ప్రభావం మనదేశంపై అంతగా ఉండదని.. అయితే, బంగ్లాదేశ్,మయన్మార్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈనెల 14న మయన్మార్ వద్ద తీరం దాటే చాన్స్ వుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారనుంది. తర్వాత ఉత్తర వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి ఈనెల పదో తేదీకల్లా తుఫాన్గా మారనుంది. ఆపై మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారి ఈనెల 11వ తేదీ వరకు తొలుత ఉత్తర వాయవ్యంగా, ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఈశాన్యంగా పయనించే క్రమంలో అతి తీవ్ర తుఫాన్గా బలపడి ఈనెల 14న దక్షిణ బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరం దాటనుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈ తుఫాన్కు ‘మోచా’ (ఎంఓసీహెచ్ఏ) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. పలకడంలో మాత్రం దీనిని మోకా అంటున్నారు. ఈ తుఫాన్ మయన్మార్- బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ.. దీని ప్రభావం ఒడిసా, పశ్చిమబెంగాల్ తీరాలపైనా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ తుఫాన్ పట్ల ఆందోళనగా ఉన్నాయి.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Read Also: Tues day Bhakthi Tv Live: మంగళవారం ఈ స్తోత్రాలు వింటే..
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, ఉక్కపోత పెరిగింది. గత రెండు రోజులు వాతావరణం చల్లబడింది. దీంతో జనం ఉపశమనం పొందారు. సోమవారం కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మోచా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎండలు ఒక్కసారిగా పెరగనున్నాయి. ఈనెల 12 తర్వాత రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంటుందని, అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, ఈనెల 14 తర్వాత తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులతో సోమవారం రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాయలసీమలో సోమవారం పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. మంగళవారం వడగాలులు వీస్తాయని, జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also: Man beats wife : అన్నం వండలేదని భార్యనే చంపేసావా! .. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తిను
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!