Interesting Railway Facts: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Interesting Railway Facts: సుదూర ప్రయాణాలకు చాలా మంది కళ్లు మూసుకొని ఎంచుకునే ప్రయాణ సాధనం ఇండియన్ రైల్వే. అలా కొండల చాటున ఉదయిస్తున్న సూర్యుడి రైలులో విండో సీట్లో కూర్చొని చూస్తూ, చాయ్ తాగుతూ చూస్తూ ఉంటే మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడో ఒకసారి ప్రతిఒక్కరూ కచ్చితంగా రైలు ప్రయాణం చేసే ఉంటారు. మరీ మీలో ఎంత మందికి ఒక కామన్ డౌట్ వచ్చింది.. ఇంతకీ ఆ డౌట్ ఎంతో తెలుసా.. రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేస్తారు. దానికి సమాధానాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Kisan Yojana: ఈ రైతులు పీఎం కిసాన్ యోజన కింద రూ. 2000 కోల్పోవచ్చు..! 22వ విడత అప్డేట్ ఇదే
Also Read
- Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
- Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
- Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
- Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
వాస్తవానికి ఒకప్పుడు రైలు బొగ్గుతో నడిచేవి, కాలక్రమేణ కరెంట్ సాయంతో నడిచే రైళ్లు వచ్చాయి. దీంతో నేడు రైళ్లలో అనేక మార్పులను మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో ఉన్న రైళ్లలో ఎన్నో సౌకర్యాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ .. ఎక్స్ప్రెస్, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎన్ని సాంకేతికతలు వచ్చినా.. రైలు ప్రయాణంలో ఒకటి మాత్రం ఇప్పటికి మారలేదు. అది ఏంటో తెలుసా.. రైలు పట్టాల మధ్యలో ఉన్న కంకర. దేశంలో ఏ మారుమూల రైల్వే ట్రాక్ను పరిశీలించిన, అందులో కంకర రాళ్లు దర్శనమిస్తాయి. వాస్తవానికి ఈ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు.
వేల టన్నుల బరువున్న రైలు పట్టాలపై వేగంగా వెళ్తున్నప్పుడు విపరీతమైన ఒత్తిడి, ప్రకంపనలు వస్తాయి. ఈ కంకర రాళ్లు ఆ బరువును సమానంగా భూమికి పంపిణీ చేస్తాయి. దీనివల్ల పట్టాలు పక్కకు జరగకుండా, భూమిలోకి కుంగిపోకుండా స్థిరంగా ఉంటాయి. అలాగే ఈ కంకర రాళ్లు చాలా వరకు శబ్ధ తీవ్రతతో పాటు కంపనాలను కూడా తగ్గిస్తాయి. వర్షం పడినప్పుడు పట్టాల మధ్య నీరు నిలిచిపోతే, కింద ఉన్న మట్టి మెత్తబడి పట్టాలు వంగిపోయే ప్రమాదం ఉంది. కానీ పట్టాల మధ్య కంకర రాళ్ల వేయడం వల్ల అందులో నుంచి ఆ వర్షం నీరు త్వరగా భూమిలోకి ఇంకిపోవడం లేదంటే పక్కకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా కంకర రాళ్లను పట్టాల మధ్య వేయడం వల్ల పిచ్చి, కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉండదు. మీరు ఒక విషయాన్ని గమనించారా.. రైలు పట్టాల మీద వేసే రాళ్లు సాధారణంగా గుండ్రంగా ఉండవు. అవి పదునైన అంచులతో ఉంటాయి. ఎందుకంటే కంకర రాళ్లు రౌండ్గా ఉంటే అవి ఒకదానిపై ఒకటి జారిపోతాయి. అదే పదునైన అంచులున్న ఉన్న రాళ్లు ఒకదానితో ఒకటి గట్టిగా లాక్ అయిపోయి, రైలు వెళ్తున్నప్పుడు కదలకుండా ఉంటాయి.
READ ALSO: Amazing Health Benefits : మీ ఇంట్లో ఈ గింజలు ఉన్నాయా? అయితే మీరు లక్కీ!
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!