Interesting Railway Facts: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Interesting Railway Facts: సుదూర ప్రయాణాలకు చాలా మంది కళ్లు మూసుకొని ఎంచుకునే ప్రయాణ సాధనం ఇండియన్ రైల్వే. అలా కొండల చాటున ఉదయిస్తున్న సూర్యుడి రైలులో విండో సీట్లో కూర్చొని చూస్తూ, చాయ్ తాగుతూ చూస్తూ ఉంటే మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడో ఒకసారి ప్రతిఒక్కరూ కచ్చితంగా రైలు ప్రయాణం చేసే ఉంటారు. మరీ మీలో ఎంత మందికి ఒక కామన్ డౌట్ వచ్చింది.. ఇంతకీ ఆ డౌట్ ఎంతో తెలుసా.. రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేస్తారు. దానికి సమాధానాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Kisan Yojana: ఈ రైతులు పీఎం కిసాన్ యోజన కింద రూ. 2000 కోల్పోవచ్చు..! 22వ విడత అప్డేట్ ఇదే
Also Read
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
వాస్తవానికి ఒకప్పుడు రైలు బొగ్గుతో నడిచేవి, కాలక్రమేణ కరెంట్ సాయంతో నడిచే రైళ్లు వచ్చాయి. దీంతో నేడు రైళ్లలో అనేక మార్పులను మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో ఉన్న రైళ్లలో ఎన్నో సౌకర్యాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ .. ఎక్స్ప్రెస్, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎన్ని సాంకేతికతలు వచ్చినా.. రైలు ప్రయాణంలో ఒకటి మాత్రం ఇప్పటికి మారలేదు. అది ఏంటో తెలుసా.. రైలు పట్టాల మధ్యలో ఉన్న కంకర. దేశంలో ఏ మారుమూల రైల్వే ట్రాక్ను పరిశీలించిన, అందులో కంకర రాళ్లు దర్శనమిస్తాయి. వాస్తవానికి ఈ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు.
వేల టన్నుల బరువున్న రైలు పట్టాలపై వేగంగా వెళ్తున్నప్పుడు విపరీతమైన ఒత్తిడి, ప్రకంపనలు వస్తాయి. ఈ కంకర రాళ్లు ఆ బరువును సమానంగా భూమికి పంపిణీ చేస్తాయి. దీనివల్ల పట్టాలు పక్కకు జరగకుండా, భూమిలోకి కుంగిపోకుండా స్థిరంగా ఉంటాయి. అలాగే ఈ కంకర రాళ్లు చాలా వరకు శబ్ధ తీవ్రతతో పాటు కంపనాలను కూడా తగ్గిస్తాయి. వర్షం పడినప్పుడు పట్టాల మధ్య నీరు నిలిచిపోతే, కింద ఉన్న మట్టి మెత్తబడి పట్టాలు వంగిపోయే ప్రమాదం ఉంది. కానీ పట్టాల మధ్య కంకర రాళ్ల వేయడం వల్ల అందులో నుంచి ఆ వర్షం నీరు త్వరగా భూమిలోకి ఇంకిపోవడం లేదంటే పక్కకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా కంకర రాళ్లను పట్టాల మధ్య వేయడం వల్ల పిచ్చి, కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉండదు. మీరు ఒక విషయాన్ని గమనించారా.. రైలు పట్టాల మీద వేసే రాళ్లు సాధారణంగా గుండ్రంగా ఉండవు. అవి పదునైన అంచులతో ఉంటాయి. ఎందుకంటే కంకర రాళ్లు రౌండ్గా ఉంటే అవి ఒకదానిపై ఒకటి జారిపోతాయి. అదే పదునైన అంచులున్న ఉన్న రాళ్లు ఒకదానితో ఒకటి గట్టిగా లాక్ అయిపోయి, రైలు వెళ్తున్నప్పుడు కదలకుండా ఉంటాయి.
READ ALSO: Amazing Health Benefits : మీ ఇంట్లో ఈ గింజలు ఉన్నాయా? అయితే మీరు లక్కీ!
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..