Interesting Railway Facts: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Interesting Railway Facts: సుదూర ప్రయాణాలకు చాలా మంది కళ్లు మూసుకొని ఎంచుకునే ప్రయాణ సాధనం ఇండియన్ రైల్వే. అలా కొండల చాటున ఉదయిస్తున్న సూర్యుడి రైలులో విండో సీట్లో కూర్చొని చూస్తూ, చాయ్ తాగుతూ చూస్తూ ఉంటే మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడో ఒకసారి ప్రతిఒక్కరూ కచ్చితంగా రైలు ప్రయాణం చేసే ఉంటారు. మరీ మీలో ఎంత మందికి ఒక కామన్ డౌట్ వచ్చింది.. ఇంతకీ ఆ డౌట్ ఎంతో తెలుసా.. రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేస్తారు. దానికి సమాధానాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Kisan Yojana: ఈ రైతులు పీఎం కిసాన్ యోజన కింద రూ. 2000 కోల్పోవచ్చు..! 22వ విడత అప్డేట్ ఇదే
Also Read
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
వాస్తవానికి ఒకప్పుడు రైలు బొగ్గుతో నడిచేవి, కాలక్రమేణ కరెంట్ సాయంతో నడిచే రైళ్లు వచ్చాయి. దీంతో నేడు రైళ్లలో అనేక మార్పులను మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో ఉన్న రైళ్లలో ఎన్నో సౌకర్యాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ .. ఎక్స్ప్రెస్, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎన్ని సాంకేతికతలు వచ్చినా.. రైలు ప్రయాణంలో ఒకటి మాత్రం ఇప్పటికి మారలేదు. అది ఏంటో తెలుసా.. రైలు పట్టాల మధ్యలో ఉన్న కంకర. దేశంలో ఏ మారుమూల రైల్వే ట్రాక్ను పరిశీలించిన, అందులో కంకర రాళ్లు దర్శనమిస్తాయి. వాస్తవానికి ఈ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు.
వేల టన్నుల బరువున్న రైలు పట్టాలపై వేగంగా వెళ్తున్నప్పుడు విపరీతమైన ఒత్తిడి, ప్రకంపనలు వస్తాయి. ఈ కంకర రాళ్లు ఆ బరువును సమానంగా భూమికి పంపిణీ చేస్తాయి. దీనివల్ల పట్టాలు పక్కకు జరగకుండా, భూమిలోకి కుంగిపోకుండా స్థిరంగా ఉంటాయి. అలాగే ఈ కంకర రాళ్లు చాలా వరకు శబ్ధ తీవ్రతతో పాటు కంపనాలను కూడా తగ్గిస్తాయి. వర్షం పడినప్పుడు పట్టాల మధ్య నీరు నిలిచిపోతే, కింద ఉన్న మట్టి మెత్తబడి పట్టాలు వంగిపోయే ప్రమాదం ఉంది. కానీ పట్టాల మధ్య కంకర రాళ్ల వేయడం వల్ల అందులో నుంచి ఆ వర్షం నీరు త్వరగా భూమిలోకి ఇంకిపోవడం లేదంటే పక్కకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా కంకర రాళ్లను పట్టాల మధ్య వేయడం వల్ల పిచ్చి, కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉండదు. మీరు ఒక విషయాన్ని గమనించారా.. రైలు పట్టాల మీద వేసే రాళ్లు సాధారణంగా గుండ్రంగా ఉండవు. అవి పదునైన అంచులతో ఉంటాయి. ఎందుకంటే కంకర రాళ్లు రౌండ్గా ఉంటే అవి ఒకదానిపై ఒకటి జారిపోతాయి. అదే పదునైన అంచులున్న ఉన్న రాళ్లు ఒకదానితో ఒకటి గట్టిగా లాక్ అయిపోయి, రైలు వెళ్తున్నప్పుడు కదలకుండా ఉంటాయి.
READ ALSO: Amazing Health Benefits : మీ ఇంట్లో ఈ గింజలు ఉన్నాయా? అయితే మీరు లక్కీ!
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..