Palla Rajeshwar Reddy : కేంద్రం చర్యల్లో రైతులకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇటీవల ఐటీ సోదాలు పెరిగాయి. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేడు ఉదయం నుంచి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే.. దీనిపై తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. మోడీ సర్కార్ విచ్చలవిడిగా కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతోందన్నారు. ఆ సంస్థలు బీజేపీ కార్యకర్తలల వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులం కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తో ఎదుర్కొంటామని, ఈ దర్యాప్తు సంస్థల దాడులకు భయపడి ఇతర పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కేంద్రం రైతులకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోందని, రైతులకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం లేదని ఆయన మండిపడ్డారు. పీఎం కిసాన్ యోజన కింద 14.5 కోట్లు రైతులు ఉన్నారని, 87,500 కోట్లు వేస్తామన్నారని, నాలుగు సంవత్సరాలలో అనేక ఆంక్షలు పీఎం కిసాన్ యోజన లో పెట్టారని ఆయన మండిపడ్డారు.
Also Read : Jogi Ramesh: పవన్ కళ్యాణ్ ప్యాకేజీ సైకో.. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ
అంతేకాకుండా.. తాజాగా 3 కోట్ల 88 లక్షల మంది రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన కింద 6 వేల రూపాయలు పంపిణీ చేశారన్నారు. పీఎం కిసాన్ యోజన కింద రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయిందని, రాష్ట్రాలలో పీఎం కిసాన్ యోజన కింద లబ్ధి పొందే రైతులు లేరు అని అంటున్నారన్నారు. ముందు 50 లక్షల మందికి రైతు బంధు ఇస్తే …ఇప్పుడు 65 లక్షల మందికి ఇస్తున్నామని, తెలంగాణలో 2014 నుంచి రైతు ఆత్మ హత్యలు తగ్గాయన్నారు. ఈ సీజన్ లో 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొన్నామని, సంయుక్త కిసాన్ మోర్చ నిర్వహించే కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడం అంటే టైం వేస్ట్ అన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రైతుల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!