MLC Kavitha: నా కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. నాది ఆస్తుల పంచాయితీ కాదు!
- కుటుంబ గొడవలపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
- నాది ఆస్తుల పంచాయితీ కాదు
- నైతికతలేని పార్టీలో ఉండదల్చుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటిసారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదుని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ.. తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీ నరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేశారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని.. అందుకే రాజీనామా చేశా అని చెప్పారు. తన రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. శాసనమండలిలో కవిత భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు.
‘ఇసుక అక్రమ రవాణా వల్ల నెరేళ్ల సంఘటనలు చోటుచేసుకున్నాయి. నేను ఒక్కదాన్నే కేసీఆర్ను ప్రశ్నించే దాన్ని. కేసీఆర్ నాకు వ్యక్తిగతంగా తండ్రి. టీఆర్ఎస్ పేరు మార్పును నేను ఒప్పుకోలేదు, ఆ మీటింగ్కు నేను హాజరుకాలేదు. తెలంగాణలో ఏం చేశారని దేశ రాజకీయాలు?. రాష్ట్రంలో యువకులు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. కేసీఆర్ మీద కక్ష్యతో బీజేపీ నన్ను జైలుకు పంపింది. ఇంత జరిగినా నాకు పార్టీ, నాయకులు మద్దతుగా నిలువ లేదు. కాళేశ్వరం మీద గోష్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ నింద వేసింది. కేసీఆర్ను విమర్శిస్తే.. నేను తప్ప ఏ ఒక్కరు మాట్లాడలేదు. అవినీతి పరులైన హరీష్ రావు, ఆయన అనుచరుల పేర్లు బయట పెట్టా. జాతీయ స్థాయిలో పని చేయాలని బీఆర్ఎస్ అనుకోవడం ఒక జోక్. బీఆర్ఎస్ చీలికలను రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ భావించింది’ అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
Also Read
Also Read: MLC Kavitha: నాపై కక్ష కట్టారు.. శాసనమండలిలో కవిత కంటతడి!
‘నాది ఆస్తుల పంచాయతీ అని ప్రచారం చేస్తున్నారు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. అన్ని పార్టీలు రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. మహిళలకు అవకాశాలు ఇవ్వాలి. అసెంబ్లీ, మండలిలో మహిళలకు సరైన గౌరవం లేదు. అజిత్ సింగ్, శిబు సొరేన్లను రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక శాలువా కప్పి ఎందుకు గౌరవం ఇవ్వలేదు. నైతికత లేని బీఆర్ఎస్ పార్టీలో ఉండలేనని రాజీనామా చేశా. తెలంగాణ బాగుండాలనేది నా లక్ష్యం. గత ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పుడు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. నేను న్యాయం వైపు ఉన్నా.. నేను ఏ తప్పు చేయలేదు. వ్యక్తిగా ఈ సభ నుంచి వెళ్తున్నా.. మళ్ళీ ఓ శక్తిగా ఈ సభకు తిరిగి తప్పకుండా వస్తా’ అని కవిత ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!