MLC Kavitha : బోధన్లో సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యే పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్ఎస్ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి ఒక్క చెరువు ను కూడ బాగు చేయలేదని, బోధన్ లో సీనియారిటీ కి సిన్సియారిటీకి మధ్యే పోటీ అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది కేవలం తెలంగాణ లోనేనని, బీఆర్ఎస్ అంటే ఇంటి పార్టీ అన్నారు. మిగితా పార్టీలకు ఈవీఎం లాగా తెలంగాణ ప్రజలు కనపడుతారని, తెలంగాణ లో గులాబీ విప్లవం వచ్చిందన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉందని, స్వాతంత్రం వచ్చాక ఏం చేశారు అని రాహుల్ యాత్ర చేసారన్నారు.
Also Read : Canara Bank : శుభవార్త చెప్పిన ప్రభుత్వ బ్యాంక్… ఇక మీ డబ్బు డబుల్ అవుతుంది
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
రాహుల్ కుటుంబం అంత పాలించి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. రాహుల్ ముత్తాత, నాన్నమ్మ, తండ్రి పాలనా చేసారు, దేశానికి ఏం చేశారు ? అని కవిత అన్నారు. రాష్ట్రం లో 10 ఏళ్ళు పాలించి కాంగ్రెస్ ఏం చేసిందని, తెలంగాణ పాలనను దేశం అంత అందిస్తామన్నారు కవిత. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించుకున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్లో 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నామని, బోధన్లో 152 చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్కు ఐటీ హబ్ తీసుకొచ్చామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఇక్కడికి గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలను కూడా తీసుకొస్తామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్గాంధీ ఇచ్చిన హామీని సైతం ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు ఎమ్మెల్సీ కవిత.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!