ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ సోదాలు చేపట్టింది. కవిత నివాసంలో నాలుగు టీమ్లుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ జరుగుతుంది. అందులో భాగంగానే.. ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఇప్పటికే కీలక నిందితులంతా అఫ్రూవల్ గా మారారు. కవిత ఢిల్లీ పీఏ సైతం అఫ్రూవల్ గా మారాడు. పీఏ అశోక్ కౌశిక్ అఫ్రూవల్ గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు బయటపెట్టాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్లుగా అంగీకరించారు. దీంతో అశోక్ ను కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సీబీఐ ఫిబ్రవరి 26న విచారణకు రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో.. కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన బండి సంజయ్..
ఇదిలా ఉంటే.. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరైంది. హైదరాబాద్లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది. అంతకుముందు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చింది. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐ, ఈడీలకు కవిత లేఖలు రాశారు. గతేడాది మార్చిలో పలుమార్లు ఈడీ ముందు కవిత విచారణకు హాజరయ్యారు.
Read Also: Amitabh Bachchan: అమితాబ్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక.. ఏమైందంటే?
మరోవైపు.. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణను భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఈనెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీం కోర్టులో గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.